Congress: కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొల్లాపూర్లో ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ప్రియాంక గాంధీ బహిరంగ సభ మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ఈ సభను రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరిక మరింత ఆలస్యమవుతుంది. కాగా ఈనెల 20న జరగాల్సిన సభను 30కి వాయిదా వేశారు. కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో సభకు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Manipur Women Video: మణిపూర్ మహిళల వేధింపుల ఘటన.. కేసు సీబీఐకి అప్పగింత
Also Read
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
మరో రెండు రోజులు రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉండడంతో కాంగ్రెస్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జన సమీకరణ కూడా కష్టమయ్యే పరిస్థితి ఉండటంతో ఈ సభను రద్దు చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక సభకు సంబంధించిన తదుపరి తేదీని వెల్లడిస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇక ఈసారి ఎలాగైనా తెలంగాణలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు రకాల డిక్లరేషన్ లను ప్రకటించి.. జనాల్లోకి తీసుకెళ్తోంది. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్షన్ పై గురి పెట్టింది.
Read Also: Sai Dharam Tej: పవన్ ఎంట్రీ అప్పుడే.. మీ చొక్కాలు చింపుకోండి కానీ పక్కనోళ్ళవి కాదు!
అయితే, ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటంతో పాటు… పలు కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇక మాజీ మంత్రి జూపల్లితో పాటు ఇతర నేతలు కూడా పార్టీలోకి రాబోతున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో కొల్లాపూర్ వేదికగా జాయిన్ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే వాయిదా పడగా… జులై 30న కూడా నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో మరోసారి కూడా వాయిదా వేశారు.
Read Also: Health Department: అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ.. వైద్య సిబ్బంది సెలవులు రద్దు
అయితే సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పనులు మొదలుపెట్టగా… సభకు ‘పాలమూరు ప్రజాభేరి’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే వచ్చే నెల ఐదో తేదీన సభను నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇక కొల్లాపూర్ సభ వేదికగానే మహిళల అభ్యున్నతి కోసం మహిళా డిక్లరేషన్ ప్రకటించాలని టీపీసీసీ చూస్తోంది. పెద్ద ఎత్తున చేరికలకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఆయన తనయుడు రాజేష్రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా చేరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తదితర అనేక మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!