PM Modi Tour: 7,8 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 7, 8 తేదీల్లో 4 రాష్ట్రాలలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ మరియు రాజస్థాన్లలో బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో డజనుకు పైగా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అంతేకాకుండా ఈ నాలుగు రాష్ట్రాలకు 50కి పైగా పథకాలను బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ పథకాల వ్యయం 50 వేల కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు.
Jagdeep Dhankhar: యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువచ్చే సమయం వచ్చింది.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 7-8 తేదీల్లో రాయ్పూర్, గోరఖ్పూర్, వారణాసి, వరంగల్ మరియు బికనీర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 50కి పైగా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. జూలై 7న ప్రధాని మోదీ ముందుగా ఢిల్లీ నుంచి రాయ్పూర్కు బయల్దేరనున్నారు. అక్కడ ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా రాయ్పూర్-విశాఖపట్నం కారిడార్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Madhya Pradesh: దారుణం.. గిరిజనుడిపై బీజేపీ నేత మూత్ర విసర్జన..!
ఆ తర్వాత ప్రధాని మోదీ గోరఖ్పూర్ వెళ్లి అక్కడ గీతా ప్రెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన 3 వందేభారత్ రైళ్లను జెండా ఊపి, గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. గోరఖ్పూర్ నుంచి ప్రధాని మోదీ తన పార్లమెంటరీ స్థానం వారణాసికి చేరుకుంటారు. ప్రధానమంత్రి అక్కడ అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. వారణాసి మరియు జౌన్పూర్ మధ్య NH 56 నాలుగు లైన్ల రోడ్డు కోసం పునాది రాయి వేస్తారు. అంతేకాకుండా మణికర్ణిక ఘాట్ మరియు హరిశ్చంద్ర ఘాట్ పునరుద్ధరణకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
Husband Killed Wife: ‘ఫోన్’ పెట్టిన చిచ్చు.. భార్యని కాల్వలో తోసేసి హత్య చేసిన భర్త
జూలై 8న ప్రధాని మోదీ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు నాగ్పూర్ విజయవాడ కారిడార్కు శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు కరీంపూర్-వరంగల్లో ఎన్హెచ్ 563 పనులను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత వరంగల్ నుండి ప్రధాని మోడీ నేరుగా రాజస్థాన్లోని బికనీర్కు వెళతారు. అక్కడ ఆయన అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అక్కడ కూడా అమృత్సర్ జామ్నగర్ ఎక్స్ప్రెస్ బహుమతి ఇవ్వబడుతుంది. అదే సమయంలో, బికనీర్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధికి పునాది వేయనున్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..