Husband Killed Wife: ‘ఫోన్’ పెట్టిన చిచ్చు.. భార్యని కాల్వలో తోసేసి హత్య చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Killed His Wife By Throwing Her Into The Canal For Using Phone Regularly In Jagityal District: ఈమధ్య ప్రతి ఒక్కరి జీవితంలో ‘మొబైల్ ఫోన్’ అనేది అనివార్యమైపోయింది. చాలామంది తమ కుటుంబ సభ్యుల కన్నా, ఫోన్తోనే ఎక్కువసేపు గడుపుతున్నారంటే.. ఏ స్థాయిలో దానికి అందరూ అడిక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. తిండి లేకపోయినా బ్రతకగలమేమో గానీ, ఫోన్ లేకపోతే మాత్రం ఉండలేమన్న పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. అఫ్కోర్స్.. ఈ మొబైల్ ఫోన్ వల్ల చాలామంది అవసరాలైతే తీరుతున్నాయి కానీ, చాలామంది కేవలం కాలక్షేపం కోసమే దీనిని వినియోగిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. మితిమీరి వాడుతున్న వారి జీవితాల్లో.. ఈ మొబైల్ ఫోన్ చిచ్చు పెడుతోంది. పచ్చని కాపురాల్లో చిచ్చు కూడా పెడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ కాపురం కూడా ఈ ఫోన్ వల్లే కూలిపోయింది. తన భార్య ఫోన్ వాడటాన్ని సహించలేకపోయిన భర్త.. ఆమెని వరద కాల్వలో పడేసి హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Etela Rajender: మా మధ్య ఎలాంటి గ్యాపులు లేవు.. ఈటల క్లారిటీ
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన జామీర్తో పది నెలల క్రితం కోరుట్లకు చెందిన సాజిదతో వివాహం అయ్యింది. వీరి సంసార జీవితం మొదట్లో సాఫీగానే సాగింది. కొన్నాళ్లు ఎలాంటి గొడవలు లేకుండా.. అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని గడిపారు. అయితే.. కొన్ని నెలల గడిచాక జామీర్, సాజిదల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇందుకు కారణం.. సాజిద తరచూ ఫోన్లో మాట్లాడటమే! గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుండటంతో.. భార్యపై జామీర్ అనుమానం పెంచుకున్నాడు. తాను తన బంధవులతోనే ఫోన్లో మాట్లాడుతానని చెప్పినా.. జామీర్ అనుమానం తీరలేదు. దీంతో.. అతడు తన భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. భూషణ్రావు పేట్ వరద కాల్వ వద్దకు తన భార్యను మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కాలువ దగ్గరికి వెళ్లిన వెంటనే.. సాజిదని తోసేసి, హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సాజిద కుటుంబ సభ్యులు.. జామీర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!