Husband Killed Wife: ‘ఫోన్’ పెట్టిన చిచ్చు.. భార్యని కాల్వలో తోసేసి హత్య చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Killed His Wife By Throwing Her Into The Canal For Using Phone Regularly In Jagityal District: ఈమధ్య ప్రతి ఒక్కరి జీవితంలో ‘మొబైల్ ఫోన్’ అనేది అనివార్యమైపోయింది. చాలామంది తమ కుటుంబ సభ్యుల కన్నా, ఫోన్తోనే ఎక్కువసేపు గడుపుతున్నారంటే.. ఏ స్థాయిలో దానికి అందరూ అడిక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. తిండి లేకపోయినా బ్రతకగలమేమో గానీ, ఫోన్ లేకపోతే మాత్రం ఉండలేమన్న పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. అఫ్కోర్స్.. ఈ మొబైల్ ఫోన్ వల్ల చాలామంది అవసరాలైతే తీరుతున్నాయి కానీ, చాలామంది కేవలం కాలక్షేపం కోసమే దీనిని వినియోగిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. మితిమీరి వాడుతున్న వారి జీవితాల్లో.. ఈ మొబైల్ ఫోన్ చిచ్చు పెడుతోంది. పచ్చని కాపురాల్లో చిచ్చు కూడా పెడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ కాపురం కూడా ఈ ఫోన్ వల్లే కూలిపోయింది. తన భార్య ఫోన్ వాడటాన్ని సహించలేకపోయిన భర్త.. ఆమెని వరద కాల్వలో పడేసి హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Etela Rajender: మా మధ్య ఎలాంటి గ్యాపులు లేవు.. ఈటల క్లారిటీ
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన జామీర్తో పది నెలల క్రితం కోరుట్లకు చెందిన సాజిదతో వివాహం అయ్యింది. వీరి సంసార జీవితం మొదట్లో సాఫీగానే సాగింది. కొన్నాళ్లు ఎలాంటి గొడవలు లేకుండా.. అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని గడిపారు. అయితే.. కొన్ని నెలల గడిచాక జామీర్, సాజిదల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇందుకు కారణం.. సాజిద తరచూ ఫోన్లో మాట్లాడటమే! గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుండటంతో.. భార్యపై జామీర్ అనుమానం పెంచుకున్నాడు. తాను తన బంధవులతోనే ఫోన్లో మాట్లాడుతానని చెప్పినా.. జామీర్ అనుమానం తీరలేదు. దీంతో.. అతడు తన భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. భూషణ్రావు పేట్ వరద కాల్వ వద్దకు తన భార్యను మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కాలువ దగ్గరికి వెళ్లిన వెంటనే.. సాజిదని తోసేసి, హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సాజిద కుటుంబ సభ్యులు.. జామీర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!