PM Modi: తన బాల్యాన్ని గుర్తుచేసుకుని ప్రధాని మోదీ కన్నీటి పర్యంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్ లో పర్యటించారు. అక్కడ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఆయన చేతుల మీదుగా ఇళ్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోనే పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన అతిపెద్ద సొసైటీని నేడు ప్రారంభించామని తెలిపారు. 2014లో హామీ ఇచ్చానని.. ఆ వాగ్దానం నెరవేరడం, దాన్ని చూడటానికి రావడం.. ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మరోవైపు.. ఈ ఇళ్లను చూడగానే తనకు బాల్యం గుర్తొచ్చిందని పేర్కొన్నారు. చిన్నతనంలో తనకు కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అని ఆలోచించా అంటూ తన బాల్యాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లను దిగమింగుకుని భావోద్వేగానికి గురయ్యారు.
Read Also: Skill Development Case: సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ వాయిదా..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఈ సందర్భంగా.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం గురించి ప్రధాని ప్రస్తావించారు. జనవరి 22వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో రామజ్యోతి వెలిగించాలని మరోసారి తెలిపారు. శ్రీరాముడి నిజాయితీని తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని ప్రధాని పేర్కొన్నారు. మన విలువలు, కట్టుబాట్లను గౌరవించాలని ఆ భగవంతుడు బోధించాడని తెలిపారు. అదే బాటలో నడుస్తూ పేదల సంక్షేమం, వారి సాధికారత కోసం పనిచేస్తున్నామని మోదీ చెప్పారు.
Read Also: Gadde Ramamohan: కేశినేని నాని టార్గెట్గా టీడీపీ ఎమ్మెల్యే విమర్శనాస్త్రాలు..
ప్రజల కలలే తమ ప్రభుత్వ హామీలని.. తమ పాలనలో చిట్టచివరి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో సంక్షేమ పథకాలు అందరికీ అందకపోవడంతో ‘గరీబీ హఠావో’ కేవలం నినాదంగా మిగిలిపోయిందని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?