Prakash Javadekar : వన్ నేషన్ – వన్ రేషన్ మోడీ ప్రభుత్వం విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో వివిధ మోర్చాల నేతలతో జరిగిన సమావేశంలో కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన్ నేషన్ – వన్ రేషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానమన్నారు. మూడేళ్లుగా 80 కోట్ల కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న మోడీ సర్కార్ అని, తెలంగాణలో ఇచ్చేవి కేసీఆర్ బియ్యం కాదు….నరేంద్ర మోడీ బియ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుడా.. మస్కట్ లో కరోనా వ్యాక్సిన్ కోసం ఒక్కొక్కరు రూ.16 వేలు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణసహా దేశవ్యాప్తంగా ఉచితంగా మోదీ కరోనా వ్యాక్సిన్ అందించారు. మోడీ వ్యాక్సిన్ మాత్రమే… కేసీఆర్ వ్యాక్సిన్ అంటే మద్యం. తెలంగాణలో లక్షలాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.6 వేల చొప్పున అందిస్తున్నారు. తెలంగాణలో 11 లక్షల మందికిపైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారు. తెలంగాణలో 30 లక్షల టాయిలెట్లు కట్టించారు. ముద్ర లోన్లు ఇచ్చారు. 40 లక్షల మందికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా అమలవుతోంది.
Also Read : Rahul Gandhi: పరువునష్టం కేసు.. రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
మోడీ ప్రభుత్వ పథకాలవల్ల లబ్ది పొందిన వాళ్లంతా 8919847687 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీకి మద్దతు పలకండి. నిన్న కరీంనగర్ డెయిరీ ఛైర్మన్ రాజేశ్వర్ రావును కలిశాను. పేదలకు మాత్రమే కాదు.. నరేంద్రమోదీ ప్రభుత్వం ఆ డెయిరీకి రూ.10 కోట్ల లబ్ది చేకూర్చారు. మోడీ 9 ఏళ్ల పాలనను – కేసీఆర్ పాలనను బేరీజు వేయండి… మోడీ దేశ ప్రజలే కుటుంబంగా భావిస్తారు.. కేసీఆర్ మాత్రం తన కుటుంబమే పరివారంగా భావిస్తారు.
Also Read : Ayodya: దీపావళి నాటికి అయోధ్య రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి..!
మోడీ కేబినెట్ లో ఏ ఒక్క మంత్రిపైనా అవినీతి మచ్చలేదు… కేసీఆర్ కేబినెట్ లో అవినీతి ఆరోపణలు లేని మంత్రులే లేరు… కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హమీలను అమలు చేయలేదు.. కేజీ టు పీజీ నుండి దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం సహా హామీలు అమలు చేయకుండా మోసం చేశారు. 2024 ఎన్నికల్లో తెలంగాణలో 14 ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. నీళ్లు-నిధులు-నియామకాల నినాదానికి కేసీఆర్ నీళ్లొదిలారు… బీజేపీకి అవకాశమిస్తే… ‘‘నీళ్లు-నిధులు-నియామకాలు’’ నినాదాన్ని సాకారం చేసి తీరుతాం.’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
-
Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
-
Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
-
Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!