Prakash Javadekar : వన్ నేషన్ – వన్ రేషన్ మోడీ ప్రభుత్వం విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో వివిధ మోర్చాల నేతలతో జరిగిన సమావేశంలో కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన్ నేషన్ – వన్ రేషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానమన్నారు. మూడేళ్లుగా 80 కోట్ల కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న మోడీ సర్కార్ అని, తెలంగాణలో ఇచ్చేవి కేసీఆర్ బియ్యం కాదు….నరేంద్ర మోడీ బియ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుడా.. మస్కట్ లో కరోనా వ్యాక్సిన్ కోసం ఒక్కొక్కరు రూ.16 వేలు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణసహా దేశవ్యాప్తంగా ఉచితంగా మోదీ కరోనా వ్యాక్సిన్ అందించారు. మోడీ వ్యాక్సిన్ మాత్రమే… కేసీఆర్ వ్యాక్సిన్ అంటే మద్యం. తెలంగాణలో లక్షలాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.6 వేల చొప్పున అందిస్తున్నారు. తెలంగాణలో 11 లక్షల మందికిపైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారు. తెలంగాణలో 30 లక్షల టాయిలెట్లు కట్టించారు. ముద్ర లోన్లు ఇచ్చారు. 40 లక్షల మందికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా అమలవుతోంది.
Also Read : Rahul Gandhi: పరువునష్టం కేసు.. రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట
Also Read
- Jobs In RBI: డిగ్రీ, పీజీ అర్హత.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ.1.50 లక్షలు..
- T20 World Cup: పాక్పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
- Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
- Natti Kumar: 'పెద్ది' కలెక్షన్లపై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం!
మోడీ ప్రభుత్వ పథకాలవల్ల లబ్ది పొందిన వాళ్లంతా 8919847687 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీకి మద్దతు పలకండి. నిన్న కరీంనగర్ డెయిరీ ఛైర్మన్ రాజేశ్వర్ రావును కలిశాను. పేదలకు మాత్రమే కాదు.. నరేంద్రమోదీ ప్రభుత్వం ఆ డెయిరీకి రూ.10 కోట్ల లబ్ది చేకూర్చారు. మోడీ 9 ఏళ్ల పాలనను – కేసీఆర్ పాలనను బేరీజు వేయండి… మోడీ దేశ ప్రజలే కుటుంబంగా భావిస్తారు.. కేసీఆర్ మాత్రం తన కుటుంబమే పరివారంగా భావిస్తారు.
Also Read : Ayodya: దీపావళి నాటికి అయోధ్య రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి..!
మోడీ కేబినెట్ లో ఏ ఒక్క మంత్రిపైనా అవినీతి మచ్చలేదు… కేసీఆర్ కేబినెట్ లో అవినీతి ఆరోపణలు లేని మంత్రులే లేరు… కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హమీలను అమలు చేయలేదు.. కేజీ టు పీజీ నుండి దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం సహా హామీలు అమలు చేయకుండా మోసం చేశారు. 2024 ఎన్నికల్లో తెలంగాణలో 14 ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. నీళ్లు-నిధులు-నియామకాల నినాదానికి కేసీఆర్ నీళ్లొదిలారు… బీజేపీకి అవకాశమిస్తే… ‘‘నీళ్లు-నిధులు-నియామకాలు’’ నినాదాన్ని సాకారం చేసి తీరుతాం.’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Jobs In RBI: డిగ్రీ, పీజీ అర్హత.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ.1.50 లక్షలు..
-
T20 World Cup: పాక్పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
-
Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
-
Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
-
Natti Kumar: ‘పెద్ది’ కలెక్షన్లపై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?