Prakash Ambedkar : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న ప్రకాష్ అంబేద్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ శుక్రవారం బేగంపేటలో మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు జోగింపల్లి సంతోష్ కుమార్ కూడా ఆయన వెంట ఉన్నారు. తనను కలిసే ముందు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తాతయ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు సంతోష్ కుమార్ చేస్తున్న కృషిని ప్రకాష్ అభినందించారు. మానవాళిలో సమానత్వం – ప్రకృతిలో సమతుల్యత కోసం పాటుపడిన తాత అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనడం నాకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోందని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.
Also Read : Sai Dharam Tej: మెగా మేనల్లుడు పంచెకట్టు వెనుక ఉన్న మతలబు క్యా హై..?
Also Read
- Siddipet District: కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
ఆయన మాట్లాడుతూ, “మా తాత, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తనను కలిసే ముందు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని కోరుకున్నారు. తోటల పెంపకంపై ఆయన ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తిని కనబరిచేవారు. ఇన్నేళ్ల తర్వాత, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మళ్లీ అదే స్ఫూర్తిని చూస్తున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది సంతోష్ కుమార్ ప్రారంభించిన భారీ ప్లాంటేషన్ కార్యక్రమం. భారతదేశం అంతటా మొక్కలు నాటడం మరియు గ్రీన్ కవర్ సృష్టించడం కోసం ప్రజలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.’ అని ఆయన అన్నారు. సంతోష్ కుమార్ చేసిన కృషిని ప్రకాష్ అంబేద్కర్ ఎంతో ప్రశంసించారు, ఇటీవల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్రవేశించినందుకు బృందాన్ని అభినందించారు.
Also Read : Hema Malini : ‘ఐ యామ్ సారీ’ అంటున్న బాలీవుడ్ డ్రీమ్ గర్ల్
“బృహత్తరమైన మొక్కలు నాటే కార్యక్రమం కోసం రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేసిన అవిశ్రాంతమైన కృషి ఎంతో అభినందనీయం. సంతోష్ కుమార్ కృషికి మరింత గుర్తింపు రావాలి, ప్రకృతి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను, ”అని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు. హరిత మరియు పరిశుభ్రమైన రాష్ట్రాన్ని సృష్టించే లక్ష్యం కోసం దోహదపడుతూ చొరవలో భాగంగా పాల్గొనేవారు మొక్కలు నాటారు.
తాజావార్తలు
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
Siddipet District: కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
-
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
-
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!