Ponnam Prabhakar: బీసీల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ.. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోమారు బీసీల గురించి చర్చను లేవనెత్తారు. తాజాగా మంత్రి బీసీల విషయమై స్పందిస్తూ.. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకని మరోసారి నిరూపించుకుందని అన్నారు. ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్నా.. అలాగే అనేకమంది బీసీ సీనియర్ నేతలు ఉన్నా సరే.., అలాగే బీజేపీ అధ్యక్షుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్న ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి కనీసం సభాపక్ష నాయకుడుని కూడా బీసీలకు ఇవ్వలేదని ఆగ్రహించారు.
Read Also:Kannappa Movie: ఊహకు మించి ‘కన్నప్ప’.. ‘మైల్ స్టోన్’ చిత్రం అవుతుంది: డిప్యూటీ సీఎం
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
అంతే కాకుండా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఓ ఫ్యూడల్ పార్టీ. బీజేపీలో బీసీలకు ఎప్పుడూ న్యాయం జరగలేదు. బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడు నామినేషన్ వెయ్యనివ్వకుండా అడ్డుకొని నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మీ పార్టీ నాయకులే వాపోతున్నారు.. దీనికి బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. ఇకపోతే, సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.
Read Also:Sri Ganesh: ట్రాఫిక్ పోలీసులపై గుర్రుమన్న ఎమ్మెల్యే.. సమస్య పరిష్కరించకపోతే ధర్నా చేస్తా..!
బీసీల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే, టీపీసీసీ అధ్యక్షుడిని బీసీని చేసుకున్నామన్నారు. మేము ఒకవైపు కుల గణన చేసుకొని బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చేస్తూ శాసన సభలో చట్టం చేసుకొని సామాజిక న్యాయం కోసం ముందుకుపోతుంటే.. బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసిందని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ బీసీల కోసం నినాదాన్ని ఎత్తుకున్నారన్నారు. తెలంగాణలో దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అంటూ తెలియచేశారు. గతంలో బీజేపీ అధ్యక్షుడు బీసీ నేత బండి సంజయ్ ఉంటే ఎన్నికల సమయంలో ఆయనను తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేసారని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!