Ponnam Prabhakar: బీసీల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ.. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోమారు బీసీల గురించి చర్చను లేవనెత్తారు. తాజాగా మంత్రి బీసీల విషయమై స్పందిస్తూ.. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకని మరోసారి నిరూపించుకుందని అన్నారు. ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్నా.. అలాగే అనేకమంది బీసీ సీనియర్ నేతలు ఉన్నా సరే.., అలాగే బీజేపీ అధ్యక్షుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్న ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి కనీసం సభాపక్ష నాయకుడుని కూడా బీసీలకు ఇవ్వలేదని ఆగ్రహించారు.
Read Also:Kannappa Movie: ఊహకు మించి ‘కన్నప్ప’.. ‘మైల్ స్టోన్’ చిత్రం అవుతుంది: డిప్యూటీ సీఎం
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
అంతే కాకుండా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఓ ఫ్యూడల్ పార్టీ. బీజేపీలో బీసీలకు ఎప్పుడూ న్యాయం జరగలేదు. బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడు నామినేషన్ వెయ్యనివ్వకుండా అడ్డుకొని నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మీ పార్టీ నాయకులే వాపోతున్నారు.. దీనికి బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. ఇకపోతే, సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.
Read Also:Sri Ganesh: ట్రాఫిక్ పోలీసులపై గుర్రుమన్న ఎమ్మెల్యే.. సమస్య పరిష్కరించకపోతే ధర్నా చేస్తా..!
బీసీల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే, టీపీసీసీ అధ్యక్షుడిని బీసీని చేసుకున్నామన్నారు. మేము ఒకవైపు కుల గణన చేసుకొని బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చేస్తూ శాసన సభలో చట్టం చేసుకొని సామాజిక న్యాయం కోసం ముందుకుపోతుంటే.. బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసిందని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ బీసీల కోసం నినాదాన్ని ఎత్తుకున్నారన్నారు. తెలంగాణలో దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అంటూ తెలియచేశారు. గతంలో బీజేపీ అధ్యక్షుడు బీసీ నేత బండి సంజయ్ ఉంటే ఎన్నికల సమయంలో ఆయనను తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేసారని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
-
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?