Kaleshwaram Project: రిపోర్ట్ వచ్చాక చర్యలు తప్పవు.. ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదలం: పొంగులేటి
- కాలేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ వచ్చాక చర్యలు తప్పవు
- ఎంత పెద్దవాళ్లు ఉన్నా చట్టపరమైన చర్యలు ఉంటాయి
- జాతిపితగా చెప్పుకునే పెద్ద మనిషి కూడా విచారణ హాజరు కావాల్సి వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర కమిషన్ రిపోర్ట్ వచ్చాక చట్టపరమైన చర్యలు తప్పవని, ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదలం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కాలేశ్వరం విచారణలో ఎలాంటి రాజకీయ కక్ష వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే.. అందులో ఎవరి పాత్ర ఉంటే వారిపైనే చర్యలు ఉంటాయన్నారు. జాతిపితగా ప్రకటించుకునే వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందు విచారణకు వచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ పథకాలు పెద్ద స్కామ్ అని పొంగులేటి మండిపడ్డారు. ములుగు జిల్లాలో మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
‘తెలంగాణ రాష్ట్రంలో మూడు అంశాల్లో దోచుకోవడం పెట్టుకున్నారు. కాలేశ్వరాన్ని ఎనిమిదవ వింతగా చూపించారు. గొప్ప ప్రాజెక్టుగా చెప్పిన కాలేశ్వరం వాళ్లున్న (బీఆర్ఎస్) సమయంలోనే కూలిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కాలేశ్వరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కాపాడే ప్రయత్నం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసారు. రాష్ట్ర సంస్థలతో విచారణ జరిపితే పొలిటికల్, తప్పుడు ప్రచారాలు జరుగుతాయని కేంద్ర సంస్థతో విచారణ చేపట్టారు. కాలేశ్వరం నిర్మాణంలో ఉన్న లోపాలు బయటపడ్డాయి. ప్రాజెక్టు పేరుతో పింక్ కలర్ కుట్రని ఛేదించేందుకు కమిషన్ని నియమించింది. కేంద్ర సంస్థ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా జడ్జితో కమిషన్ వేసి పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఉంటే.. దాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తనకు తాను తెలంగాణ జాతిపితగా చెప్పుకునే పెద్ద మనిషి కూడా విచారణ హాజరు కావాల్సి వచ్చింది’ అని మంత్రి పొంగులేటి విమర్శించారు.
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
Also Read: Revanth Reddy: నేను ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదు!
‘కమిషన్ రిపోర్టు ఆధారంగా దీని వెనక ఎంత పెద్ద వాళ్లు ఉన్నా.. వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. పేదోడు సొమ్ము తిన్న వాళ్లు ఎంత పెద్ద వాళ్లు ఉన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాలేశ్వరం విచారణలో ఎలాంటి రాజకీయ కక్ష వేధింపులు ఉండవు. కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే ఇందులో ఎవరి పాత్ర ఉంటే వారిపైనే చర్యలు ఉంటాయి. మిషన్ భగీరథలో దోచుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ భూములు అమ్ముకున్నారు. ఒక్కదాని తర్వాత మరొక దానిపై విచారణలు ఉంటాయి. ఇప్పుడు కాలేశ్వరంపై విచారణ కొనసాగుతుంది. వీటన్నింటితోటే ముడిపడిన అంశం ఫోన్ టాపింగ్. అందులో కూడా విచారణ జరుగుతుంది. అసలైన దోషులు ఎవరో త్వరలోనే తేలుతుంది’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!