Ponguleti Srinivas Reddy : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం చేశారు. ఒక్కరిని కూడా అనేది ఎవ్వరూ కూడా నమ్మలేదు. ఇలా చేయాలని ఉంటే పైకి అనకుండా పొంగులేటి తన పని ఏదో చాపకింద నీరులా చేసుకుని పదికి పది కాకపోయినా కొంత వరకు అయినా సక్సెస్ అయ్యేది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథానికి తుమ్మల నాగేశ్వరరావు రూపంలో కొంత ఉపయోగపడుతుంది. తుమ్మల ధిక్కార స్వరం వినిపిస్తే మాత్రం పొంగులేటి కంటే బిఆర్ఎస్ కు తుమ్మల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. పొంగులేటి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని పొంగులేటి శపథం తుమ్మల రూపంలో నెరవేరనున్నది. రాష్ట్ర స్థాయి కమ్మ సంఘం లో తుమ్మల గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నారు.
Also Read : Assam Rains: ఈ ఏడాది 12 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
రాష్ట్రంలో సుమారు 20 లక్షల వరకు కమ్మ. సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉన్నది. 35 నుంచి 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను తుమ్మల ప్రభావితం చేయగల శక్తి ఉన్నది. పాలేరు లో కందాల ఉపేందర్ రెడ్డి కి టికెట్ ఇవ్వకపోతే ఆ ఒక్క నియోజకవర్గం లోనే ప్రభావం ఉంటుంది. అదే తుమ్మల కు టికెట్ ఇవ్వకపోతే అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, ఇల్లెందు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తీవ్రమైన వ్యతిరేక పవనాలు రావడం. ఖాయం. అంతే కాకుండా తుమ్మల రాష్ట్రంలో ఏదైనా చక్రం తిప్పి బిఆర్ఎస్ అధికారానికి దూరం చేసినా ఆశ్చర్యం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకులైన తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారినే ప్రక్కన పెట్టడం వెనుక ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఉన్న ధైర్యం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. మొదట పొంగులేటి ధిక్కార స్వరం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరే వరకు నిత్యం ఆయన గురించే మీడియా ప్రచారం చేసింది.
Also Read : Off The Record: టీడీపీ-జనసేన పొత్తు.. బీజేపీకి మైండ్ బ్లాంక్ అయిందా..?
ఆ తర్వాత కెసిఆర్ ఎవరికి టికెట్లు ఇవ్వనున్నారో అనే ప్రచారం జరిగింది. టికెట్ల ప్రకటన తర్వాత ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తుమ్మలను పోటి సిద్దంగా చేస్తున్నారు..యే పార్టీ అనేది తెల్చకుండానే హైదరాబాదు నుండి ఖమ్మం కు వస్తున్న తుమ్మల కోసం భారీ కార్లతో ర్యాలీలతో తుమ్మల అభిమానులు అనుచర గణం ఖమ్మం చేరుకున్నారు..తుమ్మల ఎమ్ చెబుతారో అని అబిమానులు అనుచరులు ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలో తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి తుమ్మలను గెలిపించుకుంటా అని అనుచర గణం ముక్త కంఠంతో చెబుతున్నారు.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!