Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ ప్రభుత్వంలో భూ హక్కుల కోసం చారిత్రాత్మక అడుగులు
- భూభారతి చట్టంతో పేదలకు భూమిపై సంపూర్ణ హక్కులు
- ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం వైపు దూసుకెళ్తోంది
- సీతారామ కాలువ, పోడు భూముల సమస్యలు త్వరలో పరిష్కారం : మంత్రి పొంగులేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితమై పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రగతి భవన్ను జ్యోతి రావు ఫూలే భవనంగా మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇది ప్రజలకు గౌరవం ఇచ్చే ముఖ్యమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ధరణిలో చోటుచేసుకున్న అవకతవకలన్నీ సరి చేయడం కోసం కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావడమే కాకుండా, మూడు నెలలు కూడా పూర్తవకముందే దానికి సంబంధించిన విధానాలు రూపొందించడంలో ప్రభుత్వం చూపిన వేగాన్ని మంత్రి వివరించారు. అంబేడ్కర్ జయంతి రోజున శిల్పారామంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూభారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
పేదవారు సంపాదించిన భూమిపై సంపూర్ణ హక్కులు కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందించామని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు. గత పదేళ్లలో అనేక భూసంబంధిత ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం రూపొందించబడిందని పేర్కొన్నారు. ఒక్క గజం భూమికి కూడా భద్రత కల్పించేలా భూభారతిలో ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో 8.19 లక్షల కోట్లు అప్పు చేసి, నాయకులు ఫామ్ హౌస్లలో విశ్రాంతి తీసుకున్నారని విమర్శించారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఉన్నప్పటికీ, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని కొనియాడారు.
కాలేశ్వరం ప్రాజెక్టుపై కూడా మంత్రి స్పందించారు. గత ప్రభుత్వంలోనే ప్రాజెక్టు వాస్తవానికి కూలిపోయిందని తెలిపారు. కానీ అయినా Telangana రైతులు వర్షాకాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అధికంగా ధాన్యం ఉత్పత్తి చేయగలిగారని గర్వంగా వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్ని హామీల అమలు ఆలస్యం అవుతున్నా, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం, ప్రతిపక్షాల కుట్రలన్నీ కూడా నిజాయితీతో ఎదుర్కొంటూ, ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తుందని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో సాగులో ఉన్న సీతారామ కాలువ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. పోడు భూముల సమస్యను కూడా ఈ ప్రభుత్వం లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పులుసు బొంత ప్రాజెక్ట్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి త్వరలో శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు.
Tariffs War: ట్రంప్ ఎఫెక్ట్.. ఇండియా తర్వాత, ఈయూ సాయం కోరిన చైనా..
తాజావార్తలు
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్తో బాలీవుడ్లో కలకలం
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!