Tariffs War: ట్రంప్ ఎఫెక్ట్.. ఇండియా తర్వాత, ఈయూ సాయం కోరిన చైనా..
- అమెరికా, చైనాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం..
- అమెరికన్ వస్తువులపై 125 శాతం సుంకాలు పెంచిన చైనా..
- యూఎస్కి ప్రతిస్పందనగా చైనా నిర్ణయం..
Tariffs War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డొనాల్డ్ ట్రంప్ చైనాని టార్గెట్ చేస్తూ సుంకాలను పెంచారు. మిగతా ప్రపంచ దేశాలకు అమెరికా మూడు నెలలు పాటు టారిఫ్స్ని నిలిపేసింది. కానీ, చైనాకు మాత్రం అమెరికా ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. చైనా ఉత్పత్తులపై యూఎస్ విపరీతమైన సుంకాలను విధించింది. ఇదిలా ఉంటే, చైనా కూడా అంతే ధీటుగా అమెరికా వస్తువులపై సుంకాలను పెంచుతూ పోతోంది. తాజాగా, యూఎస్ వస్తువులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతామని చైనా శుక్రవారం తెలిపింది.
Read Also: Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్గా నాగేంద్రన్.. రేపు ప్రకటించే ఛాన్స్!
Also Read
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
- Giorgia Meloni Jhumka: ఝుమ్కా లుక్తో భారత్ను ఆకట్టుకున్న ఇటలీ ప్రధాని మెలోని..
- US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన
మరోవైపు, శనివారం నుంచి చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలు 145 శాతం అమలులోకి వస్తున్నాయి. అమెరికా నిర్ణయానికి ధీటుగా చైనా కూడా స్పందిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇదిలా ఉంటే, అమెరికా టారిఫ్ దెబ్బకు కలిసి పనిచేద్ధామని భారత్ని చైనా కోరింది. అమెరికా సుంకాలను అడ్డుకోవాలని చెప్పింది. తాజగా, యూరోపియన్ యూనియన్కి చైనా కలిసి పనిచేయాలని, అమెరికా నుంచి ఎదురవుతున్న వాణిజ్య యుద్ధం నుంచి బయటపడటానికి సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. చైనా పర్యటనలో ఉన్న స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్తో జరిగిన సమావేశంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. “చైనా మరియు యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాలి, ఏకపక్ష బెదిరింపు పద్ధతులను సంయుక్తంగా నిరోధించాలి” అని చైనా అధ్యక్షుడు చెప్పారు.
అంతకుముందు, భారత్ కూడా అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా పోరాడాలని చైనా కోరింది. డ్రాగన్, ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలని జిన్పింగ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కోరాడు. చైనా భారత్ ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఉన్నాయని, ఆమెరికా సుంకాల దుర్వినియోగం చేస్తోందని, ఇది ఇరు దేశాల అభివృద్ధి హక్కును, ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాలతో కలిసి నిలబడాలని అని ఇండియాలో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!