Tariffs War: ట్రంప్ ఎఫెక్ట్.. ఇండియా తర్వాత, ఈయూ సాయం కోరిన చైనా..
- అమెరికా, చైనాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం..
- అమెరికన్ వస్తువులపై 125 శాతం సుంకాలు పెంచిన చైనా..
- యూఎస్కి ప్రతిస్పందనగా చైనా నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tariffs War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డొనాల్డ్ ట్రంప్ చైనాని టార్గెట్ చేస్తూ సుంకాలను పెంచారు. మిగతా ప్రపంచ దేశాలకు అమెరికా మూడు నెలలు పాటు టారిఫ్స్ని నిలిపేసింది. కానీ, చైనాకు మాత్రం అమెరికా ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. చైనా ఉత్పత్తులపై యూఎస్ విపరీతమైన సుంకాలను విధించింది. ఇదిలా ఉంటే, చైనా కూడా అంతే ధీటుగా అమెరికా వస్తువులపై సుంకాలను పెంచుతూ పోతోంది. తాజాగా, యూఎస్ వస్తువులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతామని చైనా శుక్రవారం తెలిపింది.
Read Also: Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్గా నాగేంద్రన్.. రేపు ప్రకటించే ఛాన్స్!
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
మరోవైపు, శనివారం నుంచి చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలు 145 శాతం అమలులోకి వస్తున్నాయి. అమెరికా నిర్ణయానికి ధీటుగా చైనా కూడా స్పందిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇదిలా ఉంటే, అమెరికా టారిఫ్ దెబ్బకు కలిసి పనిచేద్ధామని భారత్ని చైనా కోరింది. అమెరికా సుంకాలను అడ్డుకోవాలని చెప్పింది. తాజగా, యూరోపియన్ యూనియన్కి చైనా కలిసి పనిచేయాలని, అమెరికా నుంచి ఎదురవుతున్న వాణిజ్య యుద్ధం నుంచి బయటపడటానికి సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. చైనా పర్యటనలో ఉన్న స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్తో జరిగిన సమావేశంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. “చైనా మరియు యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాలి, ఏకపక్ష బెదిరింపు పద్ధతులను సంయుక్తంగా నిరోధించాలి” అని చైనా అధ్యక్షుడు చెప్పారు.
అంతకుముందు, భారత్ కూడా అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా పోరాడాలని చైనా కోరింది. డ్రాగన్, ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలని జిన్పింగ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కోరాడు. చైనా భారత్ ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఉన్నాయని, ఆమెరికా సుంకాల దుర్వినియోగం చేస్తోందని, ఇది ఇరు దేశాల అభివృద్ధి హక్కును, ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాలతో కలిసి నిలబడాలని అని ఇండియాలో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!