Ponguleti Srinivas Reddy : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కొనసాగుతున్న ఇందిరమ్మ పాలన
- అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం
- ఆర్థిక కష్టాల మధ్య సంక్షేమ పథకాల అమలు
- పాత ప్రభుత్వ అప్పుల భారంతోనూ సంక్షేమంపై ఫోకస్ : పొంగులేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : పశువైద్యశాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నా అభివృద్ధి పనులు ఆపకుండా, ప్రజలకు సంక్షేమ పథకాలు నిరాటంకంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి ఇప్పటివరకు రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని వివరించారు.
Also Read
- HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Hardik Pandya: "కెప్టెన్సీ ఇస్తేనే వస్తా".. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
ముఖ్యంగా రైతుల విషయంలో ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రూ.17,000 కోట్లు రుణమాఫీ చేసిన దానికంటే, ఇందిరమ్మ ప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే రూ.21,000 కోట్లు మాఫీ చేసి 25 లక్షల 65 వేల మంది రైతన్నలకు లబ్ధి చేకూర్చిందని తెలిపారు. అంతేకాదు, రైతులు పండించిన సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అందించిన ఘనత కూడా ఇందిరమ్మ ప్రభుత్వదేనన్నారు. రైతు భరోసా పథకాన్ని గత ప్రభుత్వంతో పోలిస్తే మరింత మెరుగైన విధంగా అమలు చేశామన్నారు. త్వరలోనే మళ్లీ రైతులకు రైతు భరోసా అందించనున్నట్లు ప్రకటించారు.
గత ప్రభుత్వం చేసిన మొత్తం రూ.8.19 లక్షల కోట్ల అప్పుల బాధ్యతను తమ ప్రభుత్వం మోస్తూనే, రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల సంక్షేమం అందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హత కలిగిన పేదవారికి విడతల వారిగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మించి అందిస్తామని హామీ ఇచ్చారు. చివరగా, ప్రజల మద్దతు లేకుండా రాజకీయంగా హడావుడి చేసే నేతలకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని, ప్రజలే వారిని తిరస్కరిస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా ముజ్జుగూడెంలో ఏర్పాటైన పశువైద్యశాల నిర్మాణం, విధులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
Annamayya District: “అమ్మా.. నేనేం పాపం చేశా”.. గడ్డివాములో దొరికిన పసికందు
తాజావార్తలు
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
-
Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!