Kuna Ravi Kumar: జగన్ పహల్గాం తీవ్రవాదులకంటే ప్రమాదకరమైన వ్యక్తి.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
- గత ఐదేళ్లు ఫ్యాక్షన్ మెంటాలిటీ కలిగిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించారు
- వైసీపీ హయాంలో రాష్ట్రంలో అరరాచక పాలన సాగింది
- జగన్ ప్రభుత్వానికి జూన్ 4 న రాష్ట్ర ప్రజలు సమాధి చేశారు
- వైసీపీ వెన్నుపోటు దినం చేయటం కన్నా సంవత్సరీకం చేసుకోవాలి
- జగన్పై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. గత ఐదేళ్లు ఫ్యాక్షన్ మెంటాలిటీ కలిగిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించారని.. వైసీపీ హయాంలో రాష్ట్రంలో అరరాచక,విధ్వంస పూరిత పాలన సాగిందన్నారు. జగన్ ప్రభుత్వానికి జూన్ 4 న రాష్ట్ర ప్రజలు సమాధి చేశారని చెప్పారు. వైసీపీ వెన్నుపోటు దినం చేయటం కన్నా సంవత్సరీకం చేసుకోవాలని.. జగన్ లాంటి దౌర్భాగ్య పాలనను చూసి ప్రజలు గత యేడాది జూన్ 4 న పిండం పెట్టారన్నారు. జగన్ వెన్నుపోటుకు ప్రతిరూపం.. సీఎం గా ఉంటూ పులివెందులకు త్రాగునీరు ఇవ్వలేని వెన్నుపోతుదారుడు జగన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎత్తుకుని పెంచిన బాబాయిన హత్య చేయించిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. బాబాయి వివేకా కుటుంబానికి వెన్నుపోటు పొడిచినవాడు జగన్ అని వ్యాఖ్యానించారు. ఆస్తి కోసం తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారన్నారు.
Also Read
“జగన్ పహల్గాం తీవ్రవాదులకంటే ప్రమాదకరమైన వ్యక్తి.. డబ్బుకోసం అధికారం కోసం ఎంతటి దారుణానికైనా ఒడుగడతాడు. అరకు ఏజెన్సీలో కాఫీ తోటలు నరికి గంజాయి పండించిన ఘనత జగన్ ది. తెనాలిలో గంజాయి ముఠాలను పోలీసులు కట్టడి చేస్తే అదికూడా జగన్ రాజకీయం చేయాలని చూస్తున్నాడు. గంజాయి ముఠా సభ్యులను,రౌడీ షీటర్ల ను పరామర్శించటానికి జగన్ వెళ్తున్నాడు అంటే ప్రజలు ఆయన మనస్తత్వం అర్ధం చేసుకోవచ్చు. జగన్ అసలు రాజకీయ నాయకుడేనా? ప్రజాస్వామ్యంలో జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలు చేయటానికి అర్హుడా అని అడుగుతున్నా… రేపు వైసీపీ ప్రథమ వర్ధంతి.. రాష్ట్ర ప్రజలకి జగన్ ధరిద్రం వదిలిన రోజు.. అన్ని స్కాం లకు తాడేపల్లి ప్యాలస్ అడ్డాగా కనిపిస్తుంది.. త్వరలో జగన్ అరెస్టు అవ్వటం ఖాయం..” అని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!