Annamayya District: “అమ్మా.. నేనేం పాపం చేశా”.. గడ్డివాములో దొరికిన పసికందు
- ఓ వైపు అమ్మా.... అనే పిలుపు కోసం తహతహలాడే తల్లిదండ్రులు
- మరోవైపు.. పుట్టిన పసికందుని విదిలేస్తున్న పేరెంట్స్
- తాజాగా అన్నమయ్య జిల్లా పరిధిలో పసికందుకు ప్రత్యక్షం
- మగ శిశువు గోన సంచిలో పెట్టి విసిరేసిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మా…. అనే పిలుపు కోసం తహతహలాడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అమ్మ ప్రేమలో ఎలాంటి కల్తీ ఉండదని అంటారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామం పెద్దహరిజనవాడలో జరిగిన ఘటన తలచుకుంటే ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా అనే అనుమానం కలగక మానదు. ఏప్రిల్ 28న గ్రామ శివారులోని గంగమ్మ గుడి దగ్గర ఉన్న గడ్డివాములో అప్పుడే పుట్టిన మగ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. అదేరోజు ఉదయం 8 గంటల సమయంలో వీరనాగయ్య అనే గ్రామస్తుడు తన గడ్డివాము దగ్గరికి వెళ్లి గడ్డి పీకుతుండగా మగ శిశువు గోన సంచిలో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే వీరనాగయ్య మగ శిశువు ను గ్రామంలోకి తెచ్చి గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే శిశువును రాయచోటిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. మగ శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలపడంతో తిరిగి తన గ్రామానికి తీసుకువచ్చాడు. ఎవరో తల్లి ప్రసవించి అక్కడ వదిలేసినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: IPL 2025 Final: హై-వోల్టేజ్ మ్యాచ్కు సర్వం సిద్ధం.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబి..!
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ఈ విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకుని మగ శిశువును స్వాధీనం చేసుకుని రాయచోటిలో ఉన్న సఖీ కేంద్రానికి తరలించారు. తనకు సంతానం లేదని ఆ మగ బిడ్డను తనకి ఇస్తే తానే ఆలనా పాలన చూసుకుంటానని గ్రామస్తుడు వీరనాగయ్య అధికారులకు విన్నవించుకున్నాడు. అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా మగ శిశువును అక్కడి నుండి బలవంతంగా తీసుకెళ్లిపోయారు. దాదాపు 36 రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్న జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారులు సంబంధిత మగ బిడ్డను సంబంధిత తల్లిదండ్రులు, సంబంధీకులు బాబుని గుర్తించి తగిన ఆధారాలతో 30 రోజుల్లోపు రాయచోటి పట్టణంలోని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయానికి వచ్చి బాబు ను తీసుకువెళ్లాలంటూ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. లేనిచో ఈ బాబుని అనాధగా ప్రకటించి, ప్రభుత్వ షరతులు, నియమాల ప్రకారం మరొకరికి దత్తత కు ఇవ్వడం జరుగుతుందంటూ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!