Annamayya District: “అమ్మా.. నేనేం పాపం చేశా”.. గడ్డివాములో దొరికిన పసికందు
- ఓ వైపు అమ్మా.... అనే పిలుపు కోసం తహతహలాడే తల్లిదండ్రులు
- మరోవైపు.. పుట్టిన పసికందుని విదిలేస్తున్న పేరెంట్స్
- తాజాగా అన్నమయ్య జిల్లా పరిధిలో పసికందుకు ప్రత్యక్షం
- మగ శిశువు గోన సంచిలో పెట్టి విసిరేసిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మా…. అనే పిలుపు కోసం తహతహలాడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అమ్మ ప్రేమలో ఎలాంటి కల్తీ ఉండదని అంటారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామం పెద్దహరిజనవాడలో జరిగిన ఘటన తలచుకుంటే ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా అనే అనుమానం కలగక మానదు. ఏప్రిల్ 28న గ్రామ శివారులోని గంగమ్మ గుడి దగ్గర ఉన్న గడ్డివాములో అప్పుడే పుట్టిన మగ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. అదేరోజు ఉదయం 8 గంటల సమయంలో వీరనాగయ్య అనే గ్రామస్తుడు తన గడ్డివాము దగ్గరికి వెళ్లి గడ్డి పీకుతుండగా మగ శిశువు గోన సంచిలో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే వీరనాగయ్య మగ శిశువు ను గ్రామంలోకి తెచ్చి గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే శిశువును రాయచోటిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. మగ శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలపడంతో తిరిగి తన గ్రామానికి తీసుకువచ్చాడు. ఎవరో తల్లి ప్రసవించి అక్కడ వదిలేసినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: IPL 2025 Final: హై-వోల్టేజ్ మ్యాచ్కు సర్వం సిద్ధం.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబి..!
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఈ విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకుని మగ శిశువును స్వాధీనం చేసుకుని రాయచోటిలో ఉన్న సఖీ కేంద్రానికి తరలించారు. తనకు సంతానం లేదని ఆ మగ బిడ్డను తనకి ఇస్తే తానే ఆలనా పాలన చూసుకుంటానని గ్రామస్తుడు వీరనాగయ్య అధికారులకు విన్నవించుకున్నాడు. అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా మగ శిశువును అక్కడి నుండి బలవంతంగా తీసుకెళ్లిపోయారు. దాదాపు 36 రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్న జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారులు సంబంధిత మగ బిడ్డను సంబంధిత తల్లిదండ్రులు, సంబంధీకులు బాబుని గుర్తించి తగిన ఆధారాలతో 30 రోజుల్లోపు రాయచోటి పట్టణంలోని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయానికి వచ్చి బాబు ను తీసుకువెళ్లాలంటూ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. లేనిచో ఈ బాబుని అనాధగా ప్రకటించి, ప్రభుత్వ షరతులు, నియమాల ప్రకారం మరొకరికి దత్తత కు ఇవ్వడం జరుగుతుందంటూ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!