Annamayya District: “అమ్మా.. నేనేం పాపం చేశా”.. గడ్డివాములో దొరికిన పసికందు
- ఓ వైపు అమ్మా.... అనే పిలుపు కోసం తహతహలాడే తల్లిదండ్రులు
- మరోవైపు.. పుట్టిన పసికందుని విదిలేస్తున్న పేరెంట్స్
- తాజాగా అన్నమయ్య జిల్లా పరిధిలో పసికందుకు ప్రత్యక్షం
- మగ శిశువు గోన సంచిలో పెట్టి విసిరేసిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మా…. అనే పిలుపు కోసం తహతహలాడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అమ్మ ప్రేమలో ఎలాంటి కల్తీ ఉండదని అంటారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామం పెద్దహరిజనవాడలో జరిగిన ఘటన తలచుకుంటే ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా అనే అనుమానం కలగక మానదు. ఏప్రిల్ 28న గ్రామ శివారులోని గంగమ్మ గుడి దగ్గర ఉన్న గడ్డివాములో అప్పుడే పుట్టిన మగ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. అదేరోజు ఉదయం 8 గంటల సమయంలో వీరనాగయ్య అనే గ్రామస్తుడు తన గడ్డివాము దగ్గరికి వెళ్లి గడ్డి పీకుతుండగా మగ శిశువు గోన సంచిలో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే వీరనాగయ్య మగ శిశువు ను గ్రామంలోకి తెచ్చి గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే శిశువును రాయచోటిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. మగ శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలపడంతో తిరిగి తన గ్రామానికి తీసుకువచ్చాడు. ఎవరో తల్లి ప్రసవించి అక్కడ వదిలేసినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: IPL 2025 Final: హై-వోల్టేజ్ మ్యాచ్కు సర్వం సిద్ధం.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబి..!
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఈ విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకుని మగ శిశువును స్వాధీనం చేసుకుని రాయచోటిలో ఉన్న సఖీ కేంద్రానికి తరలించారు. తనకు సంతానం లేదని ఆ మగ బిడ్డను తనకి ఇస్తే తానే ఆలనా పాలన చూసుకుంటానని గ్రామస్తుడు వీరనాగయ్య అధికారులకు విన్నవించుకున్నాడు. అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా మగ శిశువును అక్కడి నుండి బలవంతంగా తీసుకెళ్లిపోయారు. దాదాపు 36 రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్న జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారులు సంబంధిత మగ బిడ్డను సంబంధిత తల్లిదండ్రులు, సంబంధీకులు బాబుని గుర్తించి తగిన ఆధారాలతో 30 రోజుల్లోపు రాయచోటి పట్టణంలోని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయానికి వచ్చి బాబు ను తీసుకువెళ్లాలంటూ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. లేనిచో ఈ బాబుని అనాధగా ప్రకటించి, ప్రభుత్వ షరతులు, నియమాల ప్రకారం మరొకరికి దత్తత కు ఇవ్వడం జరుగుతుందంటూ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..