IND vs AUS Final: పోలీసుల గుప్పిట్లోకి అహ్మదాబాద్ సిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రతి ఒక్కరి కోరిక టీమిండియా వరల్డ్ కప్ గెలవడమే.. అయితే, ఇప్పటికే భారత జట్టు అహ్మదాబాద్ లో అడుగుపెట్టింది. దీంతో రేపు నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుతో భారత్ తలపడబోతుంది. ఇక, ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.
Read Also: Miss Universe 2023: మిస్ యూనివర్స్ పోటీలు.. నేషనల్ కాస్ట్యూమ్స్ డేలో ఆకట్టుకున్న శ్వేతా శార్దా
Also Read
అయితే, అహ్మదాబాద్ నగరాన్ని పోలీసుల గుప్పిట్లోకి తీసుకున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా సిటీ వ్యాప్తంగా గట్టి బందోబస్తు చేశారు. ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిథులుగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ తో పాటు పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు వస్తుండటంతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అత్యున్నత సమావేశం నిర్వహించారు. అహ్మదాబాద్ లో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం చేశారు. ఇక, స్టేడియం పరిసరాల్లో 4,500 మంది పోలీసులతో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
Read Also: Jagapathi Babu : హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న జగ్గు భాయ్ ..?
ఇక, అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ కి అగంతకుల నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో.. స్టేడియంలో బాంబ్ బ్లాస్ట్ లు జరుగుతాయని పోలీసులకు అగంతకుల కాల్స్ వచ్చాయి.. ముంబై వేదికగా జరిగిన ఇండియా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ కి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి.. ఇందులో భాగంగానే అహ్మదాబాద్ స్టేడియం పరిసరాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. స్టేడియం వైపు మెట్రో రైళ్ల సంఖ్యను సైతం పెంచారు.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!