Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Tragedy: ఏపీలోని పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని దామనపల్లి, బోర్నగూడెం గిరిజన గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులు ఒకే ప్రియుడి కోసం ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. దామనపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి ఈ నెల 13వ తేదీన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకుని ప్రాణాలు విడిచింది. ఆ ఘటన జరిగిన నాలుగు రోజులు గడవక ముందే, బోర్నగూడెం గ్రామానికి చెందిన మరో యువతి (34) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకే యువకుడిని ఇద్దరు యువతులు ప్రేమించడమే ఈ దారుణానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ప్రియుడి విషయంలో ఈ ఇద్దరు యువతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగడమే కాకుండా, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. ఆ గొడవ జరిగిన మరుసటి రోజు నుంచే వరుసగా ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై దేవీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతుల మృతికి గల పూర్తి కారణాలపై పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!