PM Modi: కాంగ్రెస్ ‘మనీ హేస్ట్’.. 70 ఏళ్లుగా దోచుకుంటోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల నుంచి ఐటీ అధికారులు భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. గత బుధవారం నుంచి ఆయనకు సంబంధం ఉన్న మద్యం వ్యాపారాలపై దాడులు నిర్వహించారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో ఏకంగా రూ. 353 కోట్ల నగదు బయటపడటం దేశాన్ని నివ్వెరపరిచింది. లెక్కల్లో చూపని నల్లధనం గుట్టలు గుట్టలుగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా అధికారులు ఆశ్చర్యపోయారు. వీటిని లెక్కించేందుకు పదుల సంఖ్యలో అధికారులు, కౌంటింగ్ మిషన్లు కూడా అలసిపోయాయి. నగదు పాటు 3 కిలోల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Pakistan: పాకిస్తాన్ ఆర్మీ బేస్పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి..
Also Read
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
- Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ అవినీతికి చిరునామా ఉందని విమర్శిస్తోంది. దీనిపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ‘మనీ హేస్ట్’ డ్రామాను ప్రస్తావిస్తూ.. గత 70 ఏళ్లుగా దేశాన్ని దోచుకుంటోందని ఆరోపించారు.
‘‘ భారతదేశంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు.. మనీహీస్ట్ ఫిక్షన్ ఎవరికి అవసరం.. 70 ఏళ్లుగా దోచుకుంటున్నారు.’’ అంటూ ‘కాంగ్రెస్ మనీ హేస్ట్ని ప్రసెంట్ చేస్తోంది’ అనే క్యాప్షన్తో బీజేపీ షేర్ చేసిన వీడియోను అటాచ్ చేసి ఎక్స్(ట్విట్టర్)లో విమర్శించారు. గత రెండు దశాబ్ధాలుగా ఒడిశాలో దేశీ మద్యం వ్యాపారాన్ని చేపట్టేందుకు సాహు సోదరులకు బీజేపీ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చిందని ఒడిశాలోని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ మాట్లాడుతూ.. బీజేపీ, బీజేపీ నాణేనికి రెండు వైపులా ఉన్నాయని ఆరోపించింది.
In India, who needs 'Money Heist' fiction, when you have the Congress Party, whose heists are legendary for 70 years and counting! https://t.co/J70MCA5lcG
— Narendra Modi (@narendramodi) December 12, 2023
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!