PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM SVANidhi Scheme: చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారుల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి స్వనిధి (PM SVANidhi) పథకం విజయవంతంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2020 జూన్ 1న ప్రారంభమైన ఈ పథకం ద్వారా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో తీవ్రంగా నష్టపోయిన చిన్న వ్యాపారులకు ఈ పథకం పెద్ద ఊరటనిచ్చింది. పీఎం స్వనిధి పథకం ఆరేళ్ల పూర్తి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు అందడంతో పాటు, ఆర్థిక వ్యవస్థలో వారికి కొత్త అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ఈ పథకం నమ్మకం, సాధికారత అనే రెండు ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉందని మోడీ తెలిపారు.
చిన్న వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటూ మూలధనం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ఈ పథకం ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. ప్రభుత్వం ఇటీవల ఈ పథకాన్ని 2030 వరకు పొడిగించడమే కాకుండా, రుణ పరిమితిని రూ.80 వేల నుంచి రూ.90 వేలకు పెంచింది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఎలాంటి తాకట్టు లేదా హామీ లేకుండానే రుణం అందించడం. రుణాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతలుగా పంపిణీ చేస్తారు. మొదటి విడతలో రూ.15,000, రెండో విడతలో రూ.25,000, మూడో విడతలో రూ.50,000 వరకు రుణం అందుతుంది. అయితే ప్రతి విడత రుణాన్ని నిర్ణీత గడువులో చెల్లించిన తర్వాతే తదుపరి విడత మంజూరు అవుతుంది.
Also Read
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్గా పశ్చిమాసియా
- Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
- Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
మొదటి విడతగా తీసుకున్న రూ.15 వేల రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండో విడతగా రూ.25 వేల రుణం లభిస్తుంది. ఆ మొత్తాన్ని కూడా సమయానికి చెల్లిస్తే మూడో విడతలో రూ.50 వేల రుణం మంజూరు అవుతుంది. ఈ విధంగా మొత్తం రూ.90 వేల వరకు ఎలాంటి హామీ లేకుండా రుణం పొందే అవకాశం ఉంటుంది. పీఎం స్వనిధి పథకం కింద రుణం పొందడానికి పెద్దగా పత్రాలు అవసరం ఉండవు. ప్రధానంగా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే రుణాన్ని చిన్న చిన్న ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించే సౌలభ్యం కూడా కల్పించారు.
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సమీపంలోని ప్రభుత్వ బ్యాంకును సంప్రదించవచ్చు. దరఖాస్తు ఫారమ్ నింపి, ఆధార్ కార్డు కాపీతో పాటు అవసరమైన వివరాలను సమర్పిస్తే బ్యాంకు పరిశీలన అనంతరం రుణాన్ని మంజూరు చేస్తుంది. చిన్న వ్యాపారాల ద్వారా జీవనోపాధి పొందే లక్షలాది మంది వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం ఒక ఆర్థిక బలంగా మారిందని, భవిష్యత్తులో మరింత మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
-
Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
-
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
-
Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్గా పశ్చిమాసియా
-
CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!