Narendra Modi Tour: 19న తెలంగాణకు ప్రధాని మోడీ…పరేడ్ గ్రౌండ్స్ లో సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 19న హైదరాబాద్ రానున్నారు ప్రధాని మోడీ. ఆయన పర్యటనలో భాగంగా పెరేడ్ గ్రౌండ్ లో చిన్న సభ ఏర్పాటుచేస్తున్నారు. సికింద్రబాద్ లో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల పై ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. ప్రధాని పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్నారు మోడీ…. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకి శంకుస్థాపన చేస్తారు. కాజీపేట రైల్వే కోచ్ ఓవరాలింగ్ వర్క్ షాప్ కు కూడా శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోడీ. వందే భారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకూ తిరగనుంది. ఈ ట్రైన్ కోసం ప్రయాణికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Israel Protest : అట్టుడుకుతున్న ఇజ్రాయెల్.. రోడ్లను దిగ్బంధించిన నిరసనకారులు
Also Read
- 2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డెవలప్ మెంట్ వర్క్స్ వేగంగా చేయనున్నారు. 700 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత తొలిసారి సికింద్రాబాద్ రానున్న మోడీ ఏం మాట్లాడతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ నెల 18న ఖమ్మంలో BRS సభకు మూడు రాష్ట్రాల సీఎంలు రానున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు కేరళ సీఎం పినరయి విజయన్.. మాజీ సీఎం అఖిలేష్ లకు ఆహ్వానం పంపారు సీఎం కేసీఆర్. BRS ఏర్పాటయ్యాక తొలి బహిరంగ సభ ఇదే. తొలుత ఢిల్లీలో నిర్వహించాలని అనుకున్న సభ ఖమ్మంకు మార్పు చేశారు.
సికింద్రాబాద్ లో ప్రధాని మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రానున్న నేపధ్యంలో రైల్వే స్టేషన్ ను సందర్శించారు బీజేపీ నేతలు.రైల్వే అధికారులతో సమావేశమై ఏర్పాట్లను తెలుసుకున్నారు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్,రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు.దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బండి సంజయ్, లక్ష్మణ్ భేటీ అయ్యారు.
Read Also: Agniveer Scheme: అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ రెడీ.. ఫిబ్రవరి నుంచి ఎంట్రీ
* రూ.2,400 కోట్ల వ్యయంతో రైల్వే అభివ్రుద్ది పనులు ప్రారంభించనున్న ప్రధాని
* రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ
*vరూ.1231 కోట్లతో సికింద్రాబాద్-మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులు
• రూ.521 కోట్లతో ఖాజీపేట రైల్వే కోచ్ ఓరాలింగ్ వర్క్ షాప్ పనులను వర్క్ షాప్ పనులు
* 19న వందేభారత్ రైలు ప్రారంభం సందర్భంగా వివిధ అభివ్రుద్ధి పనులు చేపట్టనున్న మోదీ
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!