Narendra Modi: ఢిల్లీ ప్రజలకు వరాల జల్లు కురిపించిన ప్రధాని మోడీ
- ఢిల్లీ ప్రజలకు వరాల జల్లు కురిపించిన ప్రధాని మోడీ
- రూ.4,500 కోట్ల విలువైన వివిధ పథకాలను కానుకగా అందచేత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: ఢిల్లీ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు రూ.4,500 కోట్ల విలువైన వివిధ పథకాలను కానుకగా అందించనున్నారు. ప్రధాని మోదీ శుక్రవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేసారు. ‘అందరికీ హౌసింగ్’ ప్రతిజ్ఞలో భాగంగా, ఢిల్లీలోని అశోక్ విహార్లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్లో ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ కింద మురికివాడల కోసం నిర్మించిన కొత్త ఫ్లాట్లను ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు. ఢిల్లీలో ర్యాలీకి ముందు ప్రధాని మోడీ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఢిల్లీ ప్రజలకు మెరుగైన అవకాశాలు, నాణ్యమైన జీవితాన్ని అందించాలనే మా అచంచలమైన నిబద్ధత ఈ రోజు ప్రారంభించబడుతున్న ప్రాజెక్టులలో ప్రతిబింబిస్తుందని రాసుకొచ్చారు.
Also Read: Gun Firing: ముంబైలో విచక్షణారహితంగా కాల్పులు.. ఒకరికి గాయాలు
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
ఢిల్లీలోని అశోక్ విహార్లో మురికివాడల కోసం కొత్తగా నిర్మించిన 1,675 ఫ్లాట్లను ప్రధాని మోడీ ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు స్వాభిమాన్ అపార్ట్మెంట్ల తాళాలను అందజేసారు. కొత్తగా నిర్మించిన ఫ్లాట్ల ప్రారంభోత్సవం ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) ద్వారా రెండవ విజయవంతమైన ఇన్-సిటు స్లమ్ పునరావాస ప్రాజెక్ట్ను పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం ఢిల్లీలోని మురికివాడల నివాసులకు తగిన సౌకర్యాలతో మెరుగైన, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడం. ఇక ఫ్లాట్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.25 లక్షలు వెచ్చించగా.. అర్హులైన లబ్ధిదారులు మొత్తం సొమ్ములో 7 శాతం లోపే చెల్లించనున్నారు.
Also Read: IND vs AUS: మరోసారి నిరాశపరిచిన భారత్.. తక్కువ పరుగులకే ఆలౌట్
Empowering the people of Delhi with better opportunities and quality of life remains our unwavering commitment, reflecting in the projects being inaugurated today! pic.twitter.com/xr64rrDm9m
— Narendra Modi (@narendramodi) January 3, 2025
అలాగే ఢిల్లీ యూనివర్శిటీలో రూ.600 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో మూడు కొత్త ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇది తూర్పు ఢిల్లీలోని సూరజ్మల్ విహార్ లోని తూర్పు క్యాంపస్లో ఒక అకడమిక్ బ్లాక్, ద్వారకలోని పశ్చిమ క్యాంపస్లో ఒక అకడమిక్ బ్లాక్ని కలిగి ఉంటుంది. అలాగే నజఫ్గఢ్లోని రోషన్పురాలోని వీర్ సావర్కర్ కళాశాల భవనం కూడా ఉంది. వీటిలో విద్య కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..