PM Modi: ఢిల్లీ-బెంగాల్ సీనియర్ సిటిజన్లకు ప్రధాని క్షమాపణ..
- నేడు ఆయుర్వేదానికి దేవుడైన ధన్తేరస్ జయంతి
- ఈ సందర్భంగా రూ.12850 కోట్లకు పైగా విలువైన వైద్య పథకాలకు ప్రధాని శంకుస్థాపన
- వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించిన మోడీ
- ఢిల్లీ-బెంగాల్ సీనియర్ సిటిజన్లకు ప్రధాని క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి దేవుడైన ధన్వంతరి జయంతి (ధన్తేరస్) సందర్భంగా రూ.12,850 కోట్లకు పైగా విలువైన వైద్య పథకాలకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయ కారణాల వల్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడం లేదని ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలను ప్రధాని మోడీ లక్ష్యంగా చేసుకున్నారు. ఈ పథకం కింద ఈ రెండు రాష్ట్రాల్లోని వృద్ధులు ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందలేకపోవడం బాధాకరమన్నారు.
READ MORE: Formula E Car Racing: మళ్లీ తెరపైకి ఈ-కార్ రేసింగ్ నిధుల వివాదం..
Also Read
ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ నేను సేవ చేయలేనందుకు క్షమాపణలు కోరుతున్నాను అని ప్రధాని అన్నారు. మీ బాధ నాకు తెలుసు కానీ నీకు సహాయం చేయలేనని.. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ పథకాన్ని అమలు చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి అతిషీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు రావడం లేదని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం కింద ఆసుపత్రుల్లో ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం లభిస్తుంది. వారికి ‘ఆయుష్మాన్ వయ వందన’ కార్డు ఇవ్వబడుతుంది. కానీ… ఆయా రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఇది అందనందుకు చింతిస్తున్నానన్నారు.
READ MORE:Triple Talaq: అన్ని మతాలకు ఒకే రూల్.. ట్రిపుల్ తలాక్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!