Triple Talaq: అన్ని మతాలకు ఒకే రూల్.. ట్రిపుల్ తలాక్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
- షరియత్ కౌన్సిల్ ప్రైవేట్ సంస్థ
- విడాకులు కోర్టు ద్వారానే పొందాలి
- అన్ని మాతలకు ఒకే రూల్ వర్తిస్తుంది
- ట్రిపుల్ తలాక్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రిపుల్ తలాక్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. షరియత్ కౌన్సిల్ ప్రైవేట్ సంస్థ అని, కోర్టు కాదని న్యాయమూర్తి అన్నారు. ప్రస్తుతం విచారించిన కేసు 2010లో వివాహం చేసుకున్న ముస్లిం డాక్టర్ దంపతులది. భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాడని.. అయితే మూడో తలాక్ పై భర్త ఎప్పుడూ ప్రస్తావించలేదని భార్య ఆరోపించింది. అయితే షరియత్ నుంచి వచ్చిన విడాకుల సర్టిఫికేట్ ఆధారంగా డాక్టర్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతని మొదటి భార్య ఈ విషయమై కోర్టును ఆశ్రయించింది.
షరియత్ కింద జారీ చేసిన విడాకుల సర్టిఫికేట్ దిగ్భ్రాంతికరం..
మద్రాసు హైకోర్టు మధురై బెంచ్కు చెందిన జస్టిస్ జిఆర్ స్వామినాథన్.. షరియత్ కింద జారీ చేసిన విడాకుల సర్టిఫికేట్ దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ కోసం భర్త చేసిన విజ్ఞప్తిని షరియత్ అంగీకరించి మధ్యవర్తిగా మారేందుకు ప్రయత్నించిందని, అయితే భార్య సహకరించడం లేదన్నారు. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే హక్కు కోర్టుకు మాత్రమే ఉందని న్యాయమూర్తి అన్నారు. షరియత్ కౌన్సిల్ ఒక ప్రైవేట్ సంస్థ, కోర్టు కాదని స్పష్టం చేశారు. ఏ కోర్టు ఈ నిర్ణయం తీసుకోనందున, వైద్యుడి మొదటి వివాహం చెల్లుబాటు అవుతుందని ఆయన తీర్పు ఇచ్చారు.
Also Read
- Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
గృహ హింస చట్టం ప్రకారం…
హైకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. డాక్టర్ రెండో పెళ్లి చేసుకోవడంతో మొదటి భార్య మానసికంగా చాలా బాధ కలిగించిందని అన్నారు. హిందువు, క్రిస్టియన్, పార్సీ లేదా యూదుడు మొదటి వివాహం చెల్లుబాటయి నప్పటికీ రెండో వివాహం చేసుకుంటే అది క్రూరత్వంగా పరిగణించబడుతుందని న్యాయమూర్తి అన్నారు. అన్ని మతాలకు ఒకే నిబంధన ఉంటుందని తెలిపారు. గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005లోని సెక్షన్ 12 ప్రకారం.. ఇది ఖచ్చితంగా క్రూరత్వంగా పరిగణించబడుతుంది. ఇదే విషయం ముస్లింలకు కూడా వర్తిస్తుందని జస్టిస్ స్వామినాథన్ అన్నారు.
ప్రతినెలా రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయం…
భర్త ట్రిపుల్ తలాక్ చెప్పడంతో భార్య కోర్టుకెళ్లిన కేసు 2018కి సంబంధించినది. మూడో తలాక్ తనకు చెప్పలేదని ఆమె తిరునల్వేలి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్కు తెలిపారు. కాబట్టి మొదటి వివాహం ఇప్పటికీ చెల్లుతుంది. ఆమె భర్త అదే సంవత్సరం రెండో పెళ్లి చేసుకున్నాడు. 2021లో మొదటి భార్యకు అనుకూలంగా మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. అలాగే తన భార్యకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని భర్తను కోరింది. దీంతోపాటు మైనర్ పిల్లల సంరక్షణకు ప్రతినెలా రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం ఈ విషయమై భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించగా, అక్కడ అతని అప్పీలు తిరస్కరించబడింది.
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!