Nalanda University campus: నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
- బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalanda University campus: బీహార్లోని రాజ్గిర్లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్శిటీకి చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం ఇక్కడి నుంచి కొత్త క్యాంపస్కు చేరుకున్న ఆయన అక్కడ బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక మరియు వియత్నాం సహా మొత్తం 17 దేశాల నుండి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
2016లో నలంద శిథిలాలు ఐక్యరాజ్యసమితి వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిందని, ఆ తర్వాత 2017లో యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయని తెలిసిందే. విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ నలంద పురాతన శిథిలాల సమీపంలో నిర్మించబడింది. ఈ కొత్త క్యాంపస్ నలంద విశ్వవిద్యాలయ చట్టం, 2010 ద్వారా స్థాపించబడింది. 2007లో ఫిలిప్పీన్స్లో జరిగిన రెండవ తూర్పు ఆసియా సదస్సులో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు చట్టం ఏర్పాటు చేసింది.
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read Also: Canada: మరోసారి కవ్వింపు చర్యలు.. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ కు కెనడా పార్లమెంట్ నివాళి
40 తరగతి గదులు, 1900 మంది పిల్లలకు సీటింగ్ ఏర్పాటు
నలంద విశ్వవిద్యాలయంలో 40 తరగతి గదులు ఉన్న రెండు అకడమిక్ బ్లాకులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 1900 మంది పిల్లలకు సీటింగ్ ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయంలో 300 సీట్లు ఉన్న రెండు ఆడిటోరియంలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా, అంతర్జాతీయ కేంద్రం, యాంఫీథియేటర్ కూడా నిర్మించబడింది, ఇందులో 2 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఇది మాత్రమే కాకుండా, విద్యార్థులకు ఫ్యాకల్టీ క్లబ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్తో సహా అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి. నలంద విశ్వవిద్యాలయంక్యాంపస్ ‘NET zero’ క్యాంపస్, అంటే పర్యావరణ అనుకూల కార్యకలాపాలు, విద్య ఇక్కడ జరుగుతాయి. క్యాంపస్లో నీటిని రీసైకిల్ చేయడానికి ఒక ప్లాంట్, 100 ఎకరాల నీటి వనరులతో పాటు పర్యావరణ అనుకూలమైన అనేక సౌకర్యాలు ఉన్నాయి.
12వ శతాబ్దంలో ఆక్రమణదారులచే నాశనం చేయబడింది..
నలంద విశ్వవిద్యాలయం చరిత్ర చాలా పురాతనమైనది. నలంద విశ్వవిద్యాలయం 1600 సంవత్సరాల క్రితం ఐదవ శతాబ్దంలో స్థాపించబడింది. దేశంలో నలంద విశ్వవిద్యాలయం స్థాపించబడినప్పుడు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఆకర్షించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ విశ్వవిద్యాలయాలు 12వ శతాబ్దంలో ఆక్రమణదారులచే నాశనం చేయబడ్డాయి. దీనికి ముందు, ఈ పురాతన పాఠశాల సుమారు 800 సంవత్సరాల పాటు చాలా మంది విద్యార్థులకు విద్యను అందించింది.
Read Also: TTD Temple: టోకెన్ స్కాన్నింగ్ పునఃప్రారంభించనున్న టీటీడీ(వీడియో)
హ్యుయెన్ త్సాంగ్ కూడా నలంద నుంచి విద్యను అభ్యసించాడు..
నలంద విశ్వవిద్యాలయానికి పునాది గుప్త రాజవంశానికి చెందిన కుమార్ గుప్తా I ద్వారా వేయబడింది. ఐదవ శతాబ్దంలో నిర్మించిన పురాతన విశ్వవిద్యాలయంలో సుమారు 10 వేల మంది విద్యార్థులు చదువుకునేవారు, వీరికి 1500 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. చాలా మంది విద్యార్థులు ఆసియా దేశాలైన చైనా, కొరియా, జపాన్ నుండి వచ్చిన బౌద్ధ సన్యాసులు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఏడవ శతాబ్దంలో చైనీస్ సన్యాసి హ్యుయెన్ త్సాంగ్ కూడా నలందలో విద్యను అభ్యసించాడు. నలంద విశ్వవిద్యాలయం వైభవాన్ని ఆయన తన పుస్తకాల్లో ప్రస్తావించారు. బౌద్ధమతం యొక్క రెండు ముఖ్యమైన కేంద్రాలలో ఇది ఒకటి.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..