PM Modi: నేటి నుంచి రెండ్రోజుల పాటు ప్రధాని మోడీ కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు, రేపు (మంగళ, బుధవారం) కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పర్యటించనున్నారు. నేటి ఉదయం 10:45 గంటలకు, కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్నారు. స్పేస్ సెంటర్ను సందర్శించిన సందర్భంగా మూడు ముఖ్యమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఇక, దేశంలోని అంతరిక్ష రంగాన్ని దాని పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి, ఈ రంగంలో సాంకేతిక, పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోడీ పాటు పడుతున్నారు.
Read Also: Mahesh Babu : ఆ థియేటర్ ను AMBగా మార్చేస్తున్న మహేష్ బాబు..
Also Read
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
- Trump: ఇరాన్పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
- IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
తిరువనంతపురం నుంచి ఇవాళ సాయంత్రం 5:15 గంటలకు తమిళనాడులోని మధురైలో ‘క్రియేటింగ్ ది ఫ్యూచర్.. డిజిటల్ మొబిలిటీ ఫర్ ఆటోమోటివ్ MSME ఎంటర్ప్రెన్యూర్స్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక, రేపు (ఫిబ్రవరి 28న) ఉదయం 9:45 గంటలకు, తమిళనాడులోని తూత్తుకుడిలో దాదాపు రూ. 17,300 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే, రేపు సాయంత్రం 4:30 గంటలకు, ప్రధానమంత్రి మహారాష్ట్రలోని యవత్మాల్లో బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు.. అక్కడ రూ. 4,900 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేయనున్నారు. ఇక, ఈ పథకం కింద మహారాష్ట్రలోని ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు సంవత్సరానికి రూ. 6000 అదనంగా పొందుతారు. దీంతో పాటు మహారాష్ట్రలోని 5.50 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్హెచ్జీ) రూ. 825 కోట్ల రివాల్వింగ్ ఫండ్ను కూడా ప్రధాని పంపిణీ చేయనున్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద భారత ప్రభుత్వం అందించిన రివాల్వింగ్ ఫండ్కు ఈ మొత్తం అదనం అని చెప్పొచ్చు.
Read Also: Kishan Reddy : ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మోడీ వైపు చూస్తున్నారు..
అయితే, గ్రామీణ స్థాయిలో మహిళల నేతృత్వంలోని సూక్ష్మ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా పేద కుటుంబాల వార్షిక ఆదాయాన్ని పెంచడానికి ఈ రివాల్వింగ్ ఫండ్ అందించబడుతుంది. మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో ఓబీసీ కేటగిరీ లబ్ధిదారుల కోసం ప్రధాని మోడీ ఆవాస్ యోజనను స్టార్ట్ చేయనున్నారు. ఈ పథకం కింద మొదటి విడతగా రూ.375 కోట్లను 2.50 లక్షల మంది లబ్ధిదారులకు బదిలీ చేయనున్నారు. ఇది మాత్రమే కాదు.. మహారాష్ట్రలో రూ. 1,300 కోట్లకు పైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
- Tags
- bjp
- Kerala
- Maharashtra
- PM Modi
- TamilNadu
తాజావార్తలు
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..