PM Modi: నేటి నుంచి రెండ్రోజుల పాటు ప్రధాని మోడీ కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు, రేపు (మంగళ, బుధవారం) కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పర్యటించనున్నారు. నేటి ఉదయం 10:45 గంటలకు, కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్నారు. స్పేస్ సెంటర్ను సందర్శించిన సందర్భంగా మూడు ముఖ్యమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఇక, దేశంలోని అంతరిక్ష రంగాన్ని దాని పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి, ఈ రంగంలో సాంకేతిక, పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోడీ పాటు పడుతున్నారు.
Read Also: Mahesh Babu : ఆ థియేటర్ ను AMBగా మార్చేస్తున్న మహేష్ బాబు..
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
తిరువనంతపురం నుంచి ఇవాళ సాయంత్రం 5:15 గంటలకు తమిళనాడులోని మధురైలో ‘క్రియేటింగ్ ది ఫ్యూచర్.. డిజిటల్ మొబిలిటీ ఫర్ ఆటోమోటివ్ MSME ఎంటర్ప్రెన్యూర్స్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక, రేపు (ఫిబ్రవరి 28న) ఉదయం 9:45 గంటలకు, తమిళనాడులోని తూత్తుకుడిలో దాదాపు రూ. 17,300 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే, రేపు సాయంత్రం 4:30 గంటలకు, ప్రధానమంత్రి మహారాష్ట్రలోని యవత్మాల్లో బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు.. అక్కడ రూ. 4,900 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేయనున్నారు. ఇక, ఈ పథకం కింద మహారాష్ట్రలోని ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు సంవత్సరానికి రూ. 6000 అదనంగా పొందుతారు. దీంతో పాటు మహారాష్ట్రలోని 5.50 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్హెచ్జీ) రూ. 825 కోట్ల రివాల్వింగ్ ఫండ్ను కూడా ప్రధాని పంపిణీ చేయనున్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద భారత ప్రభుత్వం అందించిన రివాల్వింగ్ ఫండ్కు ఈ మొత్తం అదనం అని చెప్పొచ్చు.
Read Also: Kishan Reddy : ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మోడీ వైపు చూస్తున్నారు..
అయితే, గ్రామీణ స్థాయిలో మహిళల నేతృత్వంలోని సూక్ష్మ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా పేద కుటుంబాల వార్షిక ఆదాయాన్ని పెంచడానికి ఈ రివాల్వింగ్ ఫండ్ అందించబడుతుంది. మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో ఓబీసీ కేటగిరీ లబ్ధిదారుల కోసం ప్రధాని మోడీ ఆవాస్ యోజనను స్టార్ట్ చేయనున్నారు. ఈ పథకం కింద మొదటి విడతగా రూ.375 కోట్లను 2.50 లక్షల మంది లబ్ధిదారులకు బదిలీ చేయనున్నారు. ఇది మాత్రమే కాదు.. మహారాష్ట్రలో రూ. 1,300 కోట్లకు పైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
- Tags
- bjp
- Kerala
- Maharashtra
- PM Modi
- TamilNadu
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!