PM Modi: ఎన్నికల ఫలితాలకు ముందు 2 రోజులు మోడీ ధ్యానం.. ఎక్కడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. ఏడో విడత జూన్ 1న జరగనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో నాయకులంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంతమంది విదేశాలకు వెళ్తే.. మరికొందరు స్వదేశంలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ప్రధాని మోడీ అయితే.. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు నుంచీ.. విశ్రాంతి లేకుండా దేశ మంతా తిరుగుతూనే ఉన్నారు. ఇక చివరి విడత ఎన్నికల ప్రచారం రెండ్రోజుల్లోనే ముగియనుంది. ఇక ఎన్నికల ఫలితాలు రావడానికి మరింత సమయం ఉండడంతో ఈ మధ్యలోనే రెండ్రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని మోడీ నిర్ణయించుకున్నారు.
ఇది కూడా చదవండి: Kerala Express: బాయ్ఫ్రెండ్తో గొడవ.. కదులుతున్న రైలు ముందు దూకేసిన అమ్మాయి..
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
మే 30, 31 తేదీల్లో ప్రధాని మోడీ తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించనున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ప్రధాని ధ్యానం చేయనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి ధ్యానం చేస్తారు. అనంతరం జూన్ 1న ఆయన కన్యాకుమారి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు.
2019 లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు ముందు కూడా ప్రధాని ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు చేశారు. హిమాలయాల్లో 11,700 అడుగుల ఎత్తులో ఉన్న గుహలో ప్రధాని మోడీ ధ్యానం చేశారు. కేదార్నాథ్ నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రసిద్ధి చెందిన రుద్ర ధ్యాన గుహలో రాత్రి గడిపారు.
ఇది కూడా చదవండి: Extra Jabardasth: ఎక్స్ట్రా జబర్దస్త్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఏమైందంటే?
మూడోసారి అధికారం కోసం బీజేపీ కృషి చేస్తోంది. హ్యాట్రిక్ సాధిస్తామని ప్రధాని మోడీ కూడా అంటున్నారు.543 లోక్సభ స్థానాలు ఉన్న పార్లమెంట్లో.. ఈసారి 400 సీట్లకు పైగా స్థానాలను ఎన్డీఏ కూటమి సాధించబోతున్నట్లు ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!