NITI Aayog : ప్రధాని మోడీ అధ్యక్షతన 8వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ ( శనివారం ) జరుగనున్న నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి బీజేపీయేతర ప్రతిపక్షాల సీఎంలు హాజరు కావడం లేదు.. ఆంధ్రప్రదేశ్, ఒడిసా, ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్ మాత్రమే హాజరవుతున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పినా చివరలో ఆయనా వెళ్లడం మానుకున్నారు.
Also Read : What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంతో పాటు నీతి ఆయోగ్ వర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలే కాకుండా.. యూపీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్యమంత్రులు కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలకు తామూ హాజరు కావడం లేదని బీఆర్ఎస్ వర్గాలు కూడా తెలిపారు.
Also Read : Arvind Kejriwal : నేడు తెలంగాణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేసీఆర్తో జాతీయ రాజకీయాలపై చర్చ
తొలుత నీతి ఆయోగ్ భేటీకి హాజరై.. తర్వాత ప్రతిపక్షాల నేతలను కలుసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అనుకున్నారు. చివరకు ఆమె కూడా ఈ మీటింగ్ ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. 2045 కల్లా దేశాన్ని అభివృద్ధి చేసేందుకు (వికసిత్ భారత్) రోడ్ మ్యాప్ రూపకల్పనకు గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అవకాశం కల్పిస్తుందని నీతి ఆయోగ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Also Read : Nepal PM Visit India : నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న నేపాల్ ప్రధాని
మరోవైపు నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరిస్తున్నామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీకి శుక్రవారం రెండు పేజీల లేఖను ఆయన రాశారు. ప్రధాన మంత్రి సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండకపోతే.. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రజలు అడుగుతున్నారు.. కోఆపరేటివ్ ఫెడరలిజం ఒక జోక్ అయినప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం ఎందుకు అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Also Read : MI vs GT: గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం
నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధాని మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నారు. (i) విక్షిత్ భారత్@2047, (ii) MSMEలపై ఒత్తిడి, (iii) మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు, (iv) అనుసరణలను తగ్గించడం, (v) మహిళా సాధికారత, (vi) సహా ఎనిమిది ప్రముఖ థీమ్లు రోజంతా జరిగే సమావేశంలో చర్చించబడతాయి. ఆరోగ్యం మరియు పోషకాహారం, (vii) నైపుణ్యాభివృద్ధి, మరియు (viii) ప్రాంత అభివృద్ధి మరియు సామాజిక మౌలిక సదుపాయాల కోసం గతి శక్తి” అని నీతి ఆయోగ్ పేర్కొంది.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!