Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi Speech At Palamuru Praja Garjana Sabh

PM Modi: తెలంగాణ ప్రజలు అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు..

Published Date :October 1, 2023 , 4:43 pm
By Mahesh Jakki
PM Modi: తెలంగాణ ప్రజలు అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Modi Speech at Palamuru Praja Garjana Sabha: పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రజలందరకీ నమస్కారములు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని మోడీ తెలంగాణ వాసుల మనస్సు దోచుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటోందని.. చెప్పింది చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. ఈ ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశానన్న ప్రధాని మోడీ.. ఈ ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

Also Read: Kishan Reddy: సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణ నష్టపోతోంది..

Also Read

  • Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
  • CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
  • IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!

నాలుగేళ్ల కాలంలో ప్రజలు బీజేపీని బలోపేతం చేశారని మోడీ పేర్కొన్నారు. మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని.. అబద్దాలు, వాగ్ధానాలు కాదు.. క్షేత్ర స్థాయిలో పనులు తెలంగాణకు కావాలి. తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారని మోడీ వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో తొలుత అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఓపెన్‌టాప్‌ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ రెండో వేదికైన ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు.

Also Read: PM Modi: పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రధాని ఏం చెప్పబోతున్నారు..?

ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ సోదరీమణులకు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు ప్రధాని మోడీ. మహిళల జీవితాన్ని మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు చేపట్టామన్నారు. రాణి రుద్రమలాంటి వీరనారీమణులు పుట్టిన గడ్డ తెలంగాణ గడ్డ అంటూ కీర్తించారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. మహిళల గొంతు చట్టసభల్లో మరింత గట్టిగా వినిపించే రోజులు వస్తున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టంతో చట్టసభల్లో మహిళల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. మహిళలు ఇల్లు కట్టుకుంటే కేంద్రం పీఏంఏవై నిధులు ఇస్తోందని ప్రధాని వివరించారు. రాష్ట్రంలో 2014 వరకు కేవలం 2500 కి.మీ మేర మాత్రమే జాతీయ రహదారులు ఉన్నాయని మోడీ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల కష్టాన్ని గుర్తించి… గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఒక్క ఏడాదిలోనే రూ.27 వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమా చేశామన్నారు. ఇక్కడి ప్రభుత్వం రైతుల పేరుతో ప్రాజెక్టుల్లో అవినీతి అక్రమాల జరిగాయని ఆయన అన్నారు. ప్రాజెక్టుల పేరు మీద ఆర్భాటాలు, హంగామాలు జరుగుతాయి కానీ రైతులకు నీళ్ళు ఇవ్వరు అంటూ ప్రధాని ఆరోపణలు చేశారు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందరో రైతుల మరణానికి కారణం అయ్యారని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ భూమి ఇవ్వడం కోసం ఇక్కడి అవినీతి సర్కారు 5 ఏళ్ళ సమయం తీసుకుందన్నారు ప్రధాని మోడీ. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు పట్ల తెలంగాణ సర్కారుకు ఆసక్తి లేదన్నారు. ఆదివాసుల, గిరిజనుల పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రేమ లేదని ఆయన విమర్శలు గుప్పించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Palamuru Prajagarjana Sabha
  • PM Modi
  • PM Narendra Modi
  • telangana

తాజావార్తలు

  • Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..

  • Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!

  • Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్‌పై థియేటర్ మేనేజ్‌మెంట్ దాడి?

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!

ట్రెండింగ్‌

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions