PM Modi: ప్రతిపక్షాలు కులం, మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ ఏడాది చివరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటన సంతరించుకుంది. ఈ సందర్భంగా గ్వాలియర్ చేరుకున్న ప్రధాని.. రాష్ట్రానికి సంబంధించి రూ.19,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
Read Also: Health Tips : రోజూ 30 నిమిషాల వాకింగ్ చెయ్యడం వల్ల కలిగే లాభాలెంటో తెలుసా?
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి వ్యతిరేకులకు దేశం ఆరు దశాబ్దాలు సమయం ఇచ్చింది. అప్పుడు ఏం అభివృద్ధి చేశారని మండిపడ్డారు. అభివృద్ధిని పక్కన పెట్టి, పేదవాళ్ళ భావోద్వేగాలతో ఆడుకునేవారని విమర్శించారు. అప్పుడు కులం పేరుతో సమాజాన్ని చీల్చేవారని.. నేడు కూడా అదే పాపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు అవినీతిలో కూరుకుపోయారని.. నేడు కూడా తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం బీహార్ ప్రభుత్వం కులంపై సర్వే నివేదికను విడుదల చేసిన తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Asian Games 2023: బంగ్లాను ఓడించి.. సెమీస్కు చేరిన భారత హాకీ టీం
ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాలు కులం, మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్, కూటమి నేతలు మహిళలపై ఎలాంటి కించపరిచే మాటలు మాట్లాడుతున్నారో మనం రోజూ చూస్తూనే ఉన్నామని తెలిపారు. మహిళలకు హక్కులు దక్కడం లేదని ఆరోపణలు చేస్తూ.. కులం సాకులు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ప్రధాని అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం ఒక్కరోజులో చేసినంత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పనులు ఏ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో చేయలేదన్నారు. కొత్త ఆలోచనలు లేని, అభివృద్ధికి రోడ్ మ్యాప్ లేని వ్యక్తుల వల్ల మధ్యప్రదేశ్ అభివృద్ధి చెందదని ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రగతిని ద్వేషించడమే వారి ఏకైక పని అని విపక్షాలను దుయ్యబట్టారు. వారి ద్వేషంతో దేశం సాధించిన విజయాలను కూడా మర్చిపోతారని ప్రధాని మోడీ ఆరోపించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..