PM Modi: ప్రతిపక్షాలు కులం, మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ ఏడాది చివరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటన సంతరించుకుంది. ఈ సందర్భంగా గ్వాలియర్ చేరుకున్న ప్రధాని.. రాష్ట్రానికి సంబంధించి రూ.19,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
Read Also: Health Tips : రోజూ 30 నిమిషాల వాకింగ్ చెయ్యడం వల్ల కలిగే లాభాలెంటో తెలుసా?
Also Read
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి వ్యతిరేకులకు దేశం ఆరు దశాబ్దాలు సమయం ఇచ్చింది. అప్పుడు ఏం అభివృద్ధి చేశారని మండిపడ్డారు. అభివృద్ధిని పక్కన పెట్టి, పేదవాళ్ళ భావోద్వేగాలతో ఆడుకునేవారని విమర్శించారు. అప్పుడు కులం పేరుతో సమాజాన్ని చీల్చేవారని.. నేడు కూడా అదే పాపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు అవినీతిలో కూరుకుపోయారని.. నేడు కూడా తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం బీహార్ ప్రభుత్వం కులంపై సర్వే నివేదికను విడుదల చేసిన తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Asian Games 2023: బంగ్లాను ఓడించి.. సెమీస్కు చేరిన భారత హాకీ టీం
ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాలు కులం, మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్, కూటమి నేతలు మహిళలపై ఎలాంటి కించపరిచే మాటలు మాట్లాడుతున్నారో మనం రోజూ చూస్తూనే ఉన్నామని తెలిపారు. మహిళలకు హక్కులు దక్కడం లేదని ఆరోపణలు చేస్తూ.. కులం సాకులు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ప్రధాని అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం ఒక్కరోజులో చేసినంత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పనులు ఏ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో చేయలేదన్నారు. కొత్త ఆలోచనలు లేని, అభివృద్ధికి రోడ్ మ్యాప్ లేని వ్యక్తుల వల్ల మధ్యప్రదేశ్ అభివృద్ధి చెందదని ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రగతిని ద్వేషించడమే వారి ఏకైక పని అని విపక్షాలను దుయ్యబట్టారు. వారి ద్వేషంతో దేశం సాధించిన విజయాలను కూడా మర్చిపోతారని ప్రధాని మోడీ ఆరోపించారు.
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!