Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi Predicts Another No Confidence Motion By Opposition In 2028

PM Modi: విపక్షాలకు ప్రధాని ధన్యవాదాలు.. 2028లో మరో అవిశ్వాస తీర్మానమంటూ జోస్యం

Published Date :August 10, 2023 , 6:06 pm
By Mahesh Jakki
PM Modi: విపక్షాలకు ప్రధాని ధన్యవాదాలు..  2028లో మరో అవిశ్వాస తీర్మానమంటూ జోస్యం
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Modi: అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేవుడే అవిశ్వాసం పెట్టాలని విపక్షాలకు చెప్పారని ఆయన అన్నారు. మూడు రోజులుగా చాలామంది మాట్లాడారని.. 2018లో కూడా అవిశ్వాసం పెట్టారు. కానీ, విపక్షాలకు ఎంత మంది ఉన్నారో.. అన్ని ఓట్లు కూడా రాలేదని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. 2024లో ఎన్డీయే కూటమి అన్ని రికార్డులు బద్ధలు కొడుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై దేశ ప్రజలు పదే పదే విశ్వాసం చూపిస్తున్నారని.. కోట్లాది దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి తాము ఇక్కడ ఉన్నామన్నారు. ఇది విపక్షాలకే పరీక్ష అని తెలిపిన ప్రధాని.. అవిశ్వాస తీర్మానం కేంద్ర సర్కారుకు శుభపరిణామేనని పేర్కొన్నారు.

Also Read: Tomato Price: దిగొస్తున్న టమాటా ధరలు.. మదనపల్లి మార్కెట్లో కిలో ధర ఎంతంటే..!

అధీర్‌ను ఎందుకు మాట్లాడనివ్వలేదు.. కోల్‌కతా నుంచి ఫోన్‌ వచ్చిందేమోనంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు టైం ఇచ్చినా విపక్షాలు సిద్ధం కాలేదన్నారు. విపక్షాలకు పేదల భవిష్యత్‌ కంటే అధికారమే ముఖ్యమైపోయిందని ప్రధాని విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని ఆయన ఆరోపించారు. విపక్షాలకు అధికార దాహం పెరిగిందని మోడీ తెలిపారు. ఫీల్డింగ్‌ విపక్షాలు చేస్తుంటే.. సిక్స్‌లు, ఫోర్లు తమ వైపు వచ్చి పడ్డాయని ప్రధాని పేర్కొన్నారు. 2018లో నో కాన్ఫిడెన్స్‌.. నో బాల్‌గానే మిగిలిపోయిందని ఆయన చెప్పారు. దేశంలో ఎంత బలపడిందో చెప్పడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శమన్నారు ప్రధాని మోడీ.

Also Read: Uttarapradesh : దారుణం..యూపీలో మైనర్ దళిత బాలికపై అత్యాచారం..

ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు విస్తరింపజేశామన్నారు. స్కామ్‌లు లేని ప్రభుత్వాన్ని దేశానికి ఇచ్చామన్నారు. దేశ ప్రజల్ని ఇండియా కూటమి తప్పుదోవ పట్టిస్తోందని ప్రధాని మోడీ మండిపడ్డారు. జల జీవన్‌ మిషన్‌, స్వచ్చ భారత్‌, అభియాన్‌లు లక్షలాది మంది జీవితాల్ని నిలబెట్టాయన్నారు. మన సంక్షేమ పధకాల్ని ఐఎంఎఫ్‌ ప్రశంసించిందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హెచ్‌ఏఎల్‌పై ఇష్టానుసారం మాట్లాడారని.. బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని.. ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారని విపక్షాలపై ప్రధాని విరుచుకు పడ్డారు. చర్చ సమయంలో విపక్షాలు మాట్లాడిన ప్రతీ మాటా దేశం మొత్తం విన్నదని.. భారత్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానానికి చేరుకుంటామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత్ ఎదుగుదలను ప్రపంచం ప్రశంసిస్తోందన్నారు. ఎల్‌ఐసీ ఇప్పుడు ఎంతో పటిష్టంగా ఉందని.. ఎల్‌ఐసీ ప్రైవేటీకరణతో పేదల డబ్బులు పోతాయని ప్రచారం చేశారంటూ.. విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ.

Also Read: Uttarakhand: రాష్ట్రాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. తొమ్మిది మంది మృతి..

కాంగ్రెస్‌ హయాంలో భారత్ పేదరికంల మగ్గిపోయిందని.. కాంగ్రెస్‌కు నిజాయతీ, విజన్‌ లేదని ప్రధాని విమర్శించారు. 2014 తర్వాత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలోభారత్‌ ఐదో స్థానానికి చేరిందన్నారు. భారత సైన్యాన్ని కాంగ్రెస్ విశ్వసించడం లేదని ప్రధాని మోదీ గురువారం అన్నారు. 2028లో ప్రతిపక్షాలు మరో అవిశ్వాస తీర్మానం పెడతాయని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ఎవరిని దూషించినా అంతిమంగా అభివృద్ధి చెందుతారనడానికి తానే ఉదాహరణ అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Lok Sabha
  • no-confidence motion
  • opposition
  • Parliament

తాజావార్తలు

  • Off The Record : అంబటి రాంబాబు పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడా..?

  • Telangana: కీలక అలర్ట్.. ఆ జిల్లాలో మార్చి 28న బంద్.. కారణం ఇదే..

  • Heart Touching Story : చనిపోయినా విడిపోలేదు.. విగ్రహాలు కట్టి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు.!

  • America Currency: 165 ఏళ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్.. ఇక అమెరికా కరెన్సీపై ట్రంప్ సంతకం..

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

ట్రెండింగ్‌

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions