PM Modi: బడ్జెట్పై ప్రధాని మోడీ ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదవనున్నారు. మోడీ సర్కార్కు కూడా ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ముందు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టకూడదు.. మేము కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు మోడీ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని ప్రధాని పేర్కొన్నారు. బడ్జెట్తో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని.. ప్రజల ఆశీస్సులతో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశం ముందుకు సాగుతోందని.. అలాగే దేశ పురోగతి కొత్త శిఖరాలను తాకబోతుందని విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో మహిళలను భాగస్వామ్యం చేసినట్లు మోడీ గుర్తుచేశారు. బీజేపీ హయాంలో నారీమణులు అనేకమైన మేలు పొందారని తెలిపారు. కొత్త భవనంలో జరిగిన పార్లమెంట్ మొదటి సెషన్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందన్నారు. అలాగే పార్లమెంట్ కొత్త భవనంలో ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించడం.. గురువారం లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, అలాగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీలో జరిగిన కర్తవ్యపథ్లో మహిళలు కవాతు నిర్వహించడం ఇదంతా మహిళా శక్తి పండుగగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ఇలా ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఈ ప్రయాణం నిరంతరం ఇలానే కొనసాగుతుందని మోడీ స్పష్టం చేశారు.
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
ఇది కూడా చదవండి: Union Budget: తాయిలాలతో హ్యాట్రిక్ కొట్టనున్నారా?
ఇదిలా ఉంటే గురువారం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్లో ప్రజలకు తాయిలాలు ఉండొచ్చని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ కూడా అదే మాదిరిగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!