Union Budget: తాయిలాలతో హ్యాట్రిక్ కొట్టనున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ చదవనున్నారు. ఈ బడ్జెట్పై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది?, ఎలాంటి వరాలు ప్రకటించబోతున్నారోనన్న చర్చ నడుస్తోంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మోడీ సర్కార్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్లాన్లో భాగంగానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజాకర్షక పథకాలను ప్రకటించే ఛాన్సుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్పై ముఖ్యంగా పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు చాలా ఆశలే పెట్టుకున్నారు. అలాగే సామాన్య ప్రజలు కూడా నిత్యవసర ధరల పెరుగుదలతో నానా ఇబ్బందులు పడుతున్నరు. దీంతో ఈ బడ్జెట్లో ఊరట కలిగించే ప్రకటనలు ఉంటాయని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే కోవిడ్ సమయంలో పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలు ఉన్నాయి. వీటిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రకటిస్తే వారు లబ్ధి పొందే ఛాన్సు ఉంది.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
అలాగే మధ్య తరగతి ప్రజలు కూడా ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ధరలతో చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పన్ను శ్లాబ్పై మార్పులు ఉంటాయని నమ్మకం పెట్టుకున్నారు. రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని రూ.5 లక్షల వరకు పెంచొచ్చని భావిస్తున్నారు. అదే గనుక జరిగితే మధ్య తరగతి కుటుంబాలు లాభం పొందే అవకాశం ఉంది.
ఇక పెరిగిన నిత్యవసర ధరలతో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పప్పుల దగ్గర నుంచీ కూరగాయలు.. ఇలా ఒక్కొక్కటి ధరలన్నీ ఆకాశన్నంటాయి. ఈ నేపథ్యంలో ధరల తగ్గుదలకు ఏమైనా ప్రకటనలు ఉంటాయని ఎదురుస్తున్నారు. ఇలా ఆయా కేటగిరీ ప్రజలు కేంద్ర బడ్జెట్పై చాలా ఆశలనే పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే త్వరలోనే దేశ వ్యాప్తంగా ఓట్ల పండుగ జరగనుంది. మోడీ సర్కార్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో కచ్చితంగా ప్రజాకర్షక పథకాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరీ బడ్జెట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!