PM Modi: తమిళనాడు టూర్లో బాంబు బెదిరింపు.. భద్రత కట్టుదిట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వాలని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగియగానే తమిళనాడు కోయంబత్తూర్లో మోడీ భారీ రోడ్ షో నిర్వహించారు.
అయితే మోడీ రోడ్ షో నేపథ్యంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు కోయంబత్తూర్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వాస్తవానికి తొలుత మోడీ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అనంతరం మద్రాస్ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో మోడీ భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ప్రధాని నరేంద్ర మోడీ కోయంబత్తూరు పర్యటనకు కొన్ని గంటల ముందే బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో భారీ భద్రత మధ్య కోయంబత్తూరులో రోడ్షో నిర్వహించారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో కూడా ఐదు అంచెల భద్రతను అమలు చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ , కోయంబత్తూర్ సిటీ పోలీస్ మరియు అనేక ఇతర విభాగాల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీల తర్వాత మోడీ రోడ్ షో నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Tillu Square: ఉన్నది పాయే .. ఉంచుకున్నది పాయే.. లిల్లీతో ఏందీ లొల్లి.. టిల్లు
నగరంలోని మెట్టుపాళయం దగ్గర ప్రారంభమైన మోడీ రోడ్ షో.. ఆర్ఎస్ పురం దగ్గర ముగియనుంది. అనంతరం కన్యాకుమారిలో జరగనున్న సభలో మోడీ మాట్లాడనున్నారు.గత శనివారమే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న పోలింగ్ ప్రారంభమై జూన్ 1న ముగియనుంది. జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి.
ఇదిలా ఉంటే ఈసారి ప్రధాని మోడీ దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. మోడీ ఎక్కువ సార్లు ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు. సౌతిండియాలో బీజేపీకి మొదటి నుంచి బలం తక్కువగా ఉంటుంది. అందుకోసమే ఈసారి మోడీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!