PM Modi: ఇలా చేస్తేనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది.. దేశ ప్రజలకు మోడీ కీలక సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: జీఎస్టీ సంస్కరణలు 99% వస్తువులను 5% జీఎస్టీ పరిధిలోకి తెచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తాజాగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణ మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చివేసిందన్నారు. పేదలు ఇప్పుడు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతున్నారని.. జీఎస్టీ రేటు తగ్గడం వల్ల కలలు నెరవేరడం సులభం అవుతుందన్నారు. “2024లో గెలిచిన తరువాత జీఎస్టీకి ప్రాధాన్యం ఇచ్చాం. జీఎస్టీ సంస్కరణలపై అన్ని వర్గాలతో మాట్లాడాం. వన్ నేషన్- వన్ టాక్స్ కలను సాకారం చేశాం. అన్ని రంగాల్లో సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయి. కొత్త జీఎస్టీతో నిత్యావసర వస్తువులన్ని మరింత చౌకగా మారతాయి. జీఎస్టీ సంస్కరణలు దేశాన్ని మరింత బలంగా మారుస్తుంది. కొన్నింటిపై పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చాం.” ప్రధాని మోడీ
READ MORE: PM Modi: ఇది సామాన్యులకు తీపికబురు.. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
నాగరికత దేవోభవ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. చిన్న పరిశ్రమలే భారత్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దిక్సూచిగా మారాయన్నారు. అంతా స్వదేశీ వస్తువులనే ప్రోత్సాహించాలని.. మన దేశంలో తయారయ్యే వస్తువులనే కొనాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువులను కొన్నామని గర్వంగా చెప్పండన్నారు. దేశ స్వాతంత్య్రానికి స్వదేశీ మంత్రం శక్తినిచ్చినట్లే, నేడు స్వదేశీ దేశ శ్రేయస్సుకు కూడా శక్తినిస్తుందని అన్నారు. నేడు, అనేక విదేశీ వస్తువులు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయని.. మన జేబుల్లోని దువ్వెన విదేశీయులదా? లేక భారతీయులదా? అని విషయం కూడా మనకు తెలియదన్నారు. వీటి నుంచి విముక్తి పొంది, మన యువత కృషిని, మేడ్ ఇన్ ఇండియా వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటినీ, ప్రతి దుకాణాన్నీ స్వదేశీ చిహ్నంగా మార్చాలని మోడీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. నేను స్వదేశీని కొంటాను. నేను స్వదేశీ వస్తువులను అమ్ముతాను. అని గర్వంగా చెప్పండన్నారు. ఈ నినాదం ప్రతి భారతీయుడి నైతికతగా మారాలన్నారు. ఇది జరిగినప్పుడే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
READ MORE: 10,100mAh బ్యాటరీ, 12 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరాలతో Huawei MatePad 12 X లాంచ్!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!