PM Modi: సౌత్ ఇండియాపై బీజేపీ నజర్.. మూడు రాష్ట్రాల్లో ప్రధాని సూడిగాలి పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Election Campaign: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హాడావుడి పెరిగిపోతుంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని కూడా పెంచుతున్నాయి. కాగా, పలు సర్వేల రిపోర్టులో ఎన్డీయే (NDA ) మరోసారి అధికారంలోకి రాబోతోందని తెలియజేస్తున్నాయి. ఉత్తరాదిలో బీజేపీ ప్రభంజనం ఎలాగు ఉంటుందని చెపుతున్నాయి. కానీ, బీజేపీ అగ్రనాయకత్వం దక్షిణాది ( South India ) రాష్ట్రాలపై పూర్తి స్థాయిలో నజర్ పెట్టింది. దక్షిణాదిన వీలైనన్ని సీట్లను గెలిచి తమ బలాన్ని పెంచుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi ) దక్షిణ భారతదేశంలో ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక, ఇవాళ ఏకంగా మూడు రాష్ట్రాల్లో మోడీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
Read Also: Viral Video: శివ శివ.. అంటూ శివునికే నామం పెట్టిన దొంగ..!
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
అయితే, ఉదయం 10.30 గంటలకు కేరళలోని పతనంతిట్టకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు కేరళ ( Kerala ) బీజేపీ ( BJP ) రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్.. కేరళ బీజేపీ ఇన్ఛార్జీ ప్రకాశ్ జవదేకర్ తదితరులు స్వాగతం పలుకుతారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.. ఈ సభకు లక్ష మంది హాజరవుతారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కాగా, కేరళ ( KERALA ) నుంచి ఎన్డీయే (NDA) తరపున పోటీ చేయబోయే పలువురు అభ్యర్థులు ఈ సభకు రానున్నారు. కేరళలో సభ ముగిసిన తర్వాత ఆయన తమిళనాడు (TamilNadu) కు వెళ్లనున్నారు.
Read Also: Telangana Vehicles: వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి వాహనాలకు టీజీ రిజిస్ట్రేషన్
ఇక, తమిళనాడు (TamilNadu) రాష్ట్రంలోని కన్నియాకుమారిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi ) ప్రసంగించనున్నారు. ఈ ఏడాది మోడీ తమిళనాడులో పర్యటించడం ఇది ఐదోసారి కావడం విశేషం. ఈసారి తన ప్రధాన భాగస్వామి అన్నాడీఎంకేతో పొత్తు లేకుండానే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. కన్నియాకుమారి సభలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయధరణి కమలం గూటికి చేరబోతుంది. సభ ముగిసిన వెంటనే అక్కడి నుంచి హైదరాబాద్ ( Hyderabad) కు మోడీ బయల్దేరుతారు. కాగా, హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీ చేరుకోనున్నారు. అనంతరం మల్కాజ్ గిరిలో రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishanreddy), మల్కాజ్ గిరి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) పాల్గొంటారు. ఈ రాత్రికి నగరంలోనే రాజ్ భవన్ లో బస చేయనున్నారు.
తాజావార్తలు
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
-
Mystery Crime Thriller OTT : కంటైనర్లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
-
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!