PM Modi: కాంగ్రెస్ పాకిస్థాన్ను వెనకేసుకొస్తోంది.. పార్లమెంట్లో ప్రతిపక్షంపై మోడీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ పై లోక్సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని మోడీ ఆరోపించారు. సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని.. మీడియా హెడ్లైన్లలో వచ్చేందుకు కొందరు ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. దీంతో ప్రజల మనస్సుల్ని గెలవలేరన్నారు. పాకిస్థాన్ను కాంగ్రెస్ వెనకేసుకురావడం దౌర్భాగ్యమన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. పైలట్ అభినందన్ పాక్కు చిక్కినప్పు కూడా స్వార్థ రాజకీయాల కోసం ఇలాగే మాట్లాడారని.. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని ప్రధాని మోడీ అన్నారు. “పాకిస్థాన్ నుంచి అభినందన్ను మోడీ ఎలా తెస్తారో చూస్తాం అన్నారు. మేము అభినందన్ని సురక్షితంగా భారత్కు తీసుకొచ్చాం. విపక్షాల తీరు చూసి దేశమంతా నవ్వుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో నాపై నమ్మకం ఉంచిన దేశ ప్రజలకు రుణపడి ఉన్నాను.’’ అని ప్రధాని అన్నారు.
READ MORE: Srinivas Goud: పదవులు, పైసలు, కాంట్రాక్టులు అన్ని మీకేనా?.. అనగదొక్కుతామంటే ఊరుకోము!
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
“నేడు ప్రపంచం మొత్తం మన వాయు రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటోంది. పాకిస్థాన్ కొన్ని నిమిషాల్లోనే వేల క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. కానీ మన వాయు రక్షణ వాటన్నింటినీ గాల్లోనే ధ్వంసం చేసింది. ఇది మొత్తం దేశానికి గర్వకారణం. కానీ కొంతమంది దీనిని భరించడం కష్టంగా మారింది. కాంగ్రెస్ ప్రజలు తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. పాకిస్తాన్ అదంపూర్ వైమానిక స్థావరం గురించి అబద్ధాలు వ్యాప్తి చేసింది. కానీ నేను స్వయంగా మరుసటి రోజు అక్కడికి చేరుకుని ఇది అసత్యమని అందరికీ నిరుపించాను. ఈ సంఘటన మన రక్షణ బలాన్ని స్పష్టంగా చూపించింది.” అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
READ MORE: PM Modi: కాల్పుల విరమణపై ట్రంప్ జోక్యం ఉందా..? పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చిన మోడీ
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!