Rahul Gandhi: “పీఎం మోడీ పేపర్ లీకేజీని ఆపలేకపోయారు”.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్
- న్యాయమైన విద్యావ్యవస్థ కుప్పకూలిందని ఆరోపణ
- అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం
- యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాయమైన విద్యావ్యవస్థ కుప్పకూలిందని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. నీట్, యూజీసీ నెట్ పేపర్ లీక్ అయిందన్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్- గాజా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపారని చెప్పిన మోడీ.. భారత్ లో పేపర్ల లీక్ ను మాత్రం ఆపలేకపోతున్నారని విమర్శించారు. యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. అన్ని విద్యాసంస్థలను బీజేపీ నాయకులు కబ్జా చేశారని.. వాటికి విముక్తి లభించే వరకు ఇది కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. యూజీసీ నీట్ పరీక్ష పేపర్ లీక్ను ప్రధాని మోడీ ఆపలేకపోయారని రాహుల్ గాంధీ అన్నారు. ఒక పరీక్షలో అవకతవకలు జరిగిన తర్వాత దానిని రద్దు చేశారని.. మరో పేపర్ రద్దు చేయబడుతుందో లేదో తెలియదన్నారు. నీట్ పరీక్ష తర్వాత, ఇప్పుడు నెట్ పరీక్షలో రిగ్గింగ్ వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. పరీక్ష ముగిసిన కొన్ని గంటల్లోనే NET పరీక్ష రద్దు చేయబడిందన్నారు.
READ MORE: Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. రీల్స్ కోసం భారీగా జనాలు
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
విద్యావ్యవస్థను డీమానిటైజేషన్ చేశారని.. విద్యార్థులను దెబ్బతీస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారన్నారు. వైస్ ఛాన్సలర్ విద్యావ్యవస్థను బీజేపీ నాయకులు, వారి తల్లిదండ్రుల స్వాధీనం చేసుకోవడమే పేపర్ లీక్ కావడానికి కారణమని ఆయన ఆరోపించారు. బీహార్లో కూడా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులు మోసపోయారని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ యువతతో ఆడుకుంటుందన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలనే ప్రశ్నపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నిజాయితీపరులకు పని ఇస్తే పేపర్ లీక్ కాదన్నారు. అన్ని వైపుల నుంచి విద్యార్థులపై ఒత్తిడి ఉందని.. నిరుద్యోగం సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధాని మోడీ స్పీకర్ ఎంపికపై ఆందోళన చెందుతున్నారని..విద్యార్థులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!