Rahul Gandhi: “పీఎం మోడీ పేపర్ లీకేజీని ఆపలేకపోయారు”.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్
- న్యాయమైన విద్యావ్యవస్థ కుప్పకూలిందని ఆరోపణ
- అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం
- యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం
న్యాయమైన విద్యావ్యవస్థ కుప్పకూలిందని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. నీట్, యూజీసీ నెట్ పేపర్ లీక్ అయిందన్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్- గాజా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపారని చెప్పిన మోడీ.. భారత్ లో పేపర్ల లీక్ ను మాత్రం ఆపలేకపోతున్నారని విమర్శించారు. యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. అన్ని విద్యాసంస్థలను బీజేపీ నాయకులు కబ్జా చేశారని.. వాటికి విముక్తి లభించే వరకు ఇది కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. యూజీసీ నీట్ పరీక్ష పేపర్ లీక్ను ప్రధాని మోడీ ఆపలేకపోయారని రాహుల్ గాంధీ అన్నారు. ఒక పరీక్షలో అవకతవకలు జరిగిన తర్వాత దానిని రద్దు చేశారని.. మరో పేపర్ రద్దు చేయబడుతుందో లేదో తెలియదన్నారు. నీట్ పరీక్ష తర్వాత, ఇప్పుడు నెట్ పరీక్షలో రిగ్గింగ్ వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. పరీక్ష ముగిసిన కొన్ని గంటల్లోనే NET పరీక్ష రద్దు చేయబడిందన్నారు.
READ MORE: Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. రీల్స్ కోసం భారీగా జనాలు
Also Read
విద్యావ్యవస్థను డీమానిటైజేషన్ చేశారని.. విద్యార్థులను దెబ్బతీస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారన్నారు. వైస్ ఛాన్సలర్ విద్యావ్యవస్థను బీజేపీ నాయకులు, వారి తల్లిదండ్రుల స్వాధీనం చేసుకోవడమే పేపర్ లీక్ కావడానికి కారణమని ఆయన ఆరోపించారు. బీహార్లో కూడా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులు మోసపోయారని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ యువతతో ఆడుకుంటుందన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలనే ప్రశ్నపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నిజాయితీపరులకు పని ఇస్తే పేపర్ లీక్ కాదన్నారు. అన్ని వైపుల నుంచి విద్యార్థులపై ఒత్తిడి ఉందని.. నిరుద్యోగం సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధాని మోడీ స్పీకర్ ఎంపికపై ఆందోళన చెందుతున్నారని..విద్యార్థులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తాజావార్తలు
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
-
Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!