Rahul Gandhi: “పీఎం మోడీ పేపర్ లీకేజీని ఆపలేకపోయారు”.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్
- న్యాయమైన విద్యావ్యవస్థ కుప్పకూలిందని ఆరోపణ
- అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం
- యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాయమైన విద్యావ్యవస్థ కుప్పకూలిందని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. నీట్, యూజీసీ నెట్ పేపర్ లీక్ అయిందన్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్- గాజా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపారని చెప్పిన మోడీ.. భారత్ లో పేపర్ల లీక్ ను మాత్రం ఆపలేకపోతున్నారని విమర్శించారు. యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. అన్ని విద్యాసంస్థలను బీజేపీ నాయకులు కబ్జా చేశారని.. వాటికి విముక్తి లభించే వరకు ఇది కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. యూజీసీ నీట్ పరీక్ష పేపర్ లీక్ను ప్రధాని మోడీ ఆపలేకపోయారని రాహుల్ గాంధీ అన్నారు. ఒక పరీక్షలో అవకతవకలు జరిగిన తర్వాత దానిని రద్దు చేశారని.. మరో పేపర్ రద్దు చేయబడుతుందో లేదో తెలియదన్నారు. నీట్ పరీక్ష తర్వాత, ఇప్పుడు నెట్ పరీక్షలో రిగ్గింగ్ వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. పరీక్ష ముగిసిన కొన్ని గంటల్లోనే NET పరీక్ష రద్దు చేయబడిందన్నారు.
READ MORE: Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. రీల్స్ కోసం భారీగా జనాలు
Also Read
- Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
- Terror Plot: ఢిల్లీ, పంజాబ్లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..
- BrahMos Missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో గ్రీస్ ఒప్పందం..! టర్కీలో భయాందోళనలు
విద్యావ్యవస్థను డీమానిటైజేషన్ చేశారని.. విద్యార్థులను దెబ్బతీస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారన్నారు. వైస్ ఛాన్సలర్ విద్యావ్యవస్థను బీజేపీ నాయకులు, వారి తల్లిదండ్రుల స్వాధీనం చేసుకోవడమే పేపర్ లీక్ కావడానికి కారణమని ఆయన ఆరోపించారు. బీహార్లో కూడా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులు మోసపోయారని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ యువతతో ఆడుకుంటుందన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలనే ప్రశ్నపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నిజాయితీపరులకు పని ఇస్తే పేపర్ లీక్ కాదన్నారు. అన్ని వైపుల నుంచి విద్యార్థులపై ఒత్తిడి ఉందని.. నిరుద్యోగం సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధాని మోడీ స్పీకర్ ఎంపికపై ఆందోళన చెందుతున్నారని..విద్యార్థులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తాజావార్తలు
-
Dal Ki Dulhan : రొటీన్ గా రొట్టెలు తిని విసిగిపోయారా ? అయితే నోరూరించే నార్త్ స్పెషల్ ‘దాల్ కీ దుల్హన్’ ట్రై చేయండి.
-
Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
-
CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా
-
Heatwave : అలసట, చిరాకు, నిద్రలేమి, ఒత్తిడి, చర్మ సమస్యలు.. ఇది ఎండాకాలం కాదు బాబోయ్.. రోగాల కాలం!
-
CM Chandrababu : ఎన్టీఆర్కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!