Rahul Gandhi: “పీఎం మోడీ పేపర్ లీకేజీని ఆపలేకపోయారు”.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్
- న్యాయమైన విద్యావ్యవస్థ కుప్పకూలిందని ఆరోపణ
- అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం
- యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాయమైన విద్యావ్యవస్థ కుప్పకూలిందని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. నీట్, యూజీసీ నెట్ పేపర్ లీక్ అయిందన్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్- గాజా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపారని చెప్పిన మోడీ.. భారత్ లో పేపర్ల లీక్ ను మాత్రం ఆపలేకపోతున్నారని విమర్శించారు. యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. అన్ని విద్యాసంస్థలను బీజేపీ నాయకులు కబ్జా చేశారని.. వాటికి విముక్తి లభించే వరకు ఇది కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. యూజీసీ నీట్ పరీక్ష పేపర్ లీక్ను ప్రధాని మోడీ ఆపలేకపోయారని రాహుల్ గాంధీ అన్నారు. ఒక పరీక్షలో అవకతవకలు జరిగిన తర్వాత దానిని రద్దు చేశారని.. మరో పేపర్ రద్దు చేయబడుతుందో లేదో తెలియదన్నారు. నీట్ పరీక్ష తర్వాత, ఇప్పుడు నెట్ పరీక్షలో రిగ్గింగ్ వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. పరీక్ష ముగిసిన కొన్ని గంటల్లోనే NET పరీక్ష రద్దు చేయబడిందన్నారు.
READ MORE: Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. రీల్స్ కోసం భారీగా జనాలు
Also Read
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
విద్యావ్యవస్థను డీమానిటైజేషన్ చేశారని.. విద్యార్థులను దెబ్బతీస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారన్నారు. వైస్ ఛాన్సలర్ విద్యావ్యవస్థను బీజేపీ నాయకులు, వారి తల్లిదండ్రుల స్వాధీనం చేసుకోవడమే పేపర్ లీక్ కావడానికి కారణమని ఆయన ఆరోపించారు. బీహార్లో కూడా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులు మోసపోయారని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ యువతతో ఆడుకుంటుందన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలనే ప్రశ్నపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నిజాయితీపరులకు పని ఇస్తే పేపర్ లీక్ కాదన్నారు. అన్ని వైపుల నుంచి విద్యార్థులపై ఒత్తిడి ఉందని.. నిరుద్యోగం సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధాని మోడీ స్పీకర్ ఎంపికపై ఆందోళన చెందుతున్నారని..విద్యార్థులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తాజావార్తలు
-
Pooja Hegde: పూజా హెగ్డే తగ్గాల్సిందే.. లేదంటే కష్టమే!
-
SSMB29: ‘వారణాసి’ ఓటీటీ డీల్కే వేల కోట్ల ఆఫరా..? రాజమౌళి సినిమా కోసం దిగ్గజ సంస్థల పోటీ!
-
Producer Narsamma: సినిమా తీసి సర్వం కోల్పోయాం.. ‘ప్రభాస్’ గారు మాకు మీరే దిక్కు: మహిళా రైతు నిర్మాత
-
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
-
KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!