PM Modi: మహిళలకు మోడీ బంపర్ ఆఫర్.. ప్రతి మహిళకు ఏటా రూ.36 వేలు! బెంగాల్ వేదికగా ప్రధాని హామీ
- టీఎంసీపై నిప్పులు చెరిగిన ప్రధాని
- బిష్ణుపూర్లో విజయ సంకల్ప సభలో పాల్గొన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పశ్చిమ బెంగాల్లోని బిష్ణుపూర్లో జరిగిన ‘విజయ సంకల్ప సభ’లో ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కేంద్ర పథకాలను అడ్డుకుంటున్న టీఎంసీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళా సాధికారతే లక్ష్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను ప్రధాని వివరించారు
Also Read
- Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
- Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
- Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
మాతృశక్తి భరోసా కార్డు: రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఈ కార్డు ద్వారా ఏటా రూ.36,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
గర్భిణీలకు సాయం: గర్భిణీ స్త్రీలకు రూ. 21,000 ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు, బిడ్డ పుట్టినప్పుడు అదనంగా రూ.5,000 సాయం అందుతుందని పేర్కొన్నారు.
విద్య, భవిష్యత్తు: ఆడపిల్లల చదువు, భవిష్యత్తు కోసం రూ. 50,000 ఆర్థిక సాయం అందజేస్తామని వాగ్దానం చేశారు.
ఆరోగ్యం, గృహవసతి: ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.1.5 లక్షల సాయం అందిస్తామన్నారు.
టీఎంసీపై విరుచుకుపడిన ప్రధాని..
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును టీఎంసీ వ్యతిరేకించడాన్ని మోడీ తప్పుబట్టారు. “బెంగాల్ సోదరీమణుల కలలను టీఎంసీ నీరుగార్చింది. మహిళల రాజకీయ భాగస్వామ్యం ఆ పార్టీకి ఇష్టం లేదు” అని మండిపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పట్ల టీఎంసీ నేతల అనుచిత వైఖరిని ప్రస్తావిస్తూ, గిరిజన మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న చిన్నచూపును ఎండగట్టారు. టీఎంసీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, దీనిని తాము సహించబోమని స్పష్టం చేశారు. పేదలకు అందాల్సిన ఉచిత రేషన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పంపిణీ చేయడం లేదని ధ్వజమెత్తారు.
బెంగాల్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, బీజేపీ అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను కఠినంగా అమలు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు కాకుండా అడ్డుకుంటున్న ‘స్పీడ్ బ్రేకర్’ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆయన ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో మార్పు తథ్యమని, మహిళల శక్తితోనే అభివృద్ధి చెందిన భారతదేశం, అభివృద్ధి చెందిన బెంగాల్ నిర్మాణం సాధ్యమవుతుందని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
-
Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
-
Peddi : ‘పెద్ది’తో రామ్చరణ్ పాన్ ఇండియా కొట్టాల్సిందే.. లేదంటే అంతే
-
Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు