PM Modi: 15 టాప్ టెక్ కంపినీల సీఈవోలతో రౌండ్టేబుల్ భేటీ నిర్వహించిన మోడీ!
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా.
- అమెరికా టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం.
- 15 ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈవోలు హాజరయ్యారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ భారతదేశ వృద్ధి అవకాశాలపై ఆయన ఉద్ఘాటించారు. అలాగే వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే కార్యక్రమాలపై చర్చించారు. మోడీ 3 రోజుల అమెరికా పర్యటన సందర్భంగా ఆదివారం లొట్టే న్యూయార్క్ ప్యాలెస్ హోటల్లో ఈ భేటీ జరిగింది. సమాచారం ప్రకారం.. AI, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై పనిచేస్తున్న 15 ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈవోలు దీనికి హాజరయ్యారు. ఈ సమావేశం చాలా విజయవంతమైంది.
Devi Sri Prasad: అమెరికా ప్రధాని మోడీ సభలో ఊర్రూతలూగించిన డీఎస్పి..
Also Read
- Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
- Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
- Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
న్యూయార్క్లో టెక్నాలజీ సీఈఓలతో ఫలవంతమైన రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించామని.. ఇందులో టెక్, ఇన్నోవేషన్ మరియు ఇతర అంశాల గురించి చర్చించామని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలోని పోస్ట్లో ప్రధాని మోదీ తెలిపారు. ఈ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని కూడా హైలైట్ చేసింది. భారతదేశం పట్ల అపారమైన ఆశావాదాన్ని చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, శిఖరాగ్ర సమావేశంలో సాంకేతిక సహకారం, ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ICET) వంటి ప్రయత్నాలు భారతదేశం – అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ప్రధానమైనవి అని మోడీ తెలిపారు. తన మూడవ టర్మ్ లో, భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని అందుకు సహకారం, ఆవిష్కరణల కోసం భారతదేశ వృద్ధి కథనాన్ని సద్వినియోగం చేసుకునేలా కంపెనీలను ప్రోత్సహించాలని ప్రధాని ఉద్ఘాటించారు.
Hydra Focus: హడలెత్తిస్తున్న హైడ్రా.. నేడు గుట్టల బేగంపేట్ పరిధిలో కూల్చివేతలు..!
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ద్వారా నిర్వహించబడిన ఈ సమావేశంలో గూగుల్ సీఈఓ పిచాయ్, అడోబీ సీఈఓ శంతను నారాయణ్, Accenture సీఈఓ జూలీ స్వీట్, NVIDIA సీఈఓ జెన్సన్ హువాంగ్లతో సహా అగ్రశ్రేణి అమెరికా టెక్ సంస్థల సీఈఓలు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్లో పాల్గొన్న ఇతరులలో AMD, HP Inc సీఈఓ లిసా సు కూడా ఉన్నారు. వెరిజోన్ సీఈఓ ఎన్రిక్ లోర్స్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, మోడరన్ చైర్మన్ డాక్టర్ నౌబర్ అఫ్యాన్, వెరిజోన్ సీఈఓ హన్స్ వెస్ట్బర్గ్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేధో సంపత్తిని పరిరక్షించడంలో, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భారతదేశం లోతైన నిబద్ధత గురించి వ్యాపార దిగ్గజాలకు హామీ ఇస్తూ, దేశంలో జరుగుతున్న ఆర్థిక పరివర్తనను మోడీ హైలైట్ చేశారు.
తాజావార్తలు
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
-
Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!