Hydra Focus: హడలెత్తిస్తున్న హైడ్రా.. నేడు గుట్టల బేగంపేట్ పరిధిలో కూల్చివేతలు..!
- నిన్న కూకట్ పల్లి- సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాలను నేల మట్టం చేసిన హైడ్రా..
- ఇవాళ గుట్టల బేగంపేట్ పరిధిలో కూల్చివేతలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydra Focus: హైదరాబాద్లో గత కొద్దిరోజులుగా కూల్చివేతలను ఆపిన హైడ్రా మళ్లీ నిన్న (ఆదివారం) నుంచి కూల్చివేతలు ప్రారంభించింది. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. నిన్న కూకట్ పల్లి, సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా టీం నేల మట్టం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కావేరి కొండల్లో నిర్మాణాలపై దృష్టి సారించింది. హైడ్రా అధికారులు, పోలీసులు సోమవారం ఉదయం కావూరి హిల్స్కు చేరుకున్నారు. ఈ క్రమంలో కావూరిహిల్స్లోని పార్కును ఆక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. పార్క్ స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణంపై కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమంగా నిర్మించిన షెడ్లను కూల్చివేశారు. ఈ అక్రమ కట్టడాలను తొలగించి కావేరి హిల్స్ పార్క్ పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు. అనంతరం గుట్టలలోని బేగంపేట ప్రాంతంలో నేడు హైడ్రామా కూల్చివేతలకు అవకాశం ఉంది. పార్కులోని ఆక్రమణల నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రామా సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో గుట్టల బేగంపేట్ పరిధిలోని స్థానికులు గుండెలు గుబేలు మంటున్నాయి. ఎప్పుడు హైడ్రా టీం వస్తుందో ఇల్లను కూల్చేస్తుందో అన్నట్లు ప్రజలు ఆవేదనతో ఉన్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేట సర్వే నంబర్ 164 లోని ప్రభుత్వ భూమిలో అర్థరాత్రి వరకు హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. మూడో భవనం నేలమట్టం కావడంతో హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణ దశలో ఉన్న మరో భారీ భవనాన్ని హైడ్రా అధికారులు బాహుబలి మెషిన్ తో కూల్చివేశారు హైడ్రా టీమ్. అర్థరాత్రి 1గంట వరకు కూల్చివేతలు కొనసాగాయి. వర్షం కారణంగా కాస్త బ్రేక్ ఇచ్చిన హైడ్రా అధికారులు. ఆ తరువాత కూల్చివేతలు ప్రారంభం చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేంత వరకు ఎంత అర్ధరాత్రి అయినా సరే పని ముగించుకుని వెళతామని హైడ్రా టీం వెల్లడించింది. దీంతో నిన్న (ఆదివారం) రాత్రి వరకు హైడ్రా కూల్చివేతలు పూర్తిచేసింది. ఇక కూకట్ పల్లి నల్లచెరువులో 16 కమర్షియల్ షెడ్లను కూల్చివేసి నాలుగు ఎకరాలను హైడ్రా నేడు స్వాధీనం చేసుకుంది. మరోవైపు కృష్ణారెడ్డిపేటలో అమీన్ పూర్ మూడు భవనాలను కూల్చి ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
Telangana Rains: బంగాళాఖాతంలో ఆవర్తనం.. గ్రేటర్కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ..
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..