PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం
- ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంపై ప్రధాని ఫోకస్
- పనితీరుపై అధికారుల నుంచి ప్రజెంటేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పాలనలో సంస్కరణలు, విధానాల అమలు వేగవంతం చేయడం, ప్రజలకు ప్రభుత్వ సేవల అందుబాటు మెరుగుపరచడం, అలాగే ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనకు సంబంధించిన కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. కొద్ది వారాల క్రితం కేంద్ర మంత్రివర్గ సభ్యులు, సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో దీర్ఘకాలిక సంస్కరణలపై ప్రధాని దిశానిర్దేశం చేసిన అనంతరం ఇప్పుడు ఈ సమీక్షా సమావేశం జరుగుతోంది.
పనితీరుపై ప్రజెంటేషన్
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ప్రతి మంత్రిత్వ శాఖ కార్యదర్శి తమ శాఖ పనితీరుపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్య విధానాల అమలు, పాలనలో తీసుకున్న చర్యల పురోగతిని వివరించనున్నారు. దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా తదుపరి తరం సంస్కరణలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది.
Also Read
ప్రధాని అసంతృప్తి
ఇంతకుముందు జరిగిన సమీక్షా సమావేశంలో ప్రధాని మోడీ.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు అనవసరంగా పెండింగ్లో ఉండకూడదని స్పష్టం చేశారు. నిర్ణయాలు వేగంగా తీసుకోవాలని, పరిపాలనా ప్రక్రియలను సరళీకృతం చేయాలని, ఉత్పాదకత పెంచాలని, వ్యవస్థాగత సంస్కరణలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో ‘వికసిత్ భారత్ 2047’ అనేది కేవలం నినాదం కాదని.. ప్రభుత్వ దృఢ సంకల్పమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రధాని మోడీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం లేకుండా చూడాలని, ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని అధికారులను ఆదేశించే అవకాశం ఉంది. అదే విధంగా జీవన సౌలభ్యం, వ్యాపార నిర్వహణ సౌలభ్యం మెరుగుపరచేందుకు చేపట్టాల్సిన సంస్కరణలపై కూడా చర్చించనున్నారు.
ఇక దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా సమావేశంలో సమీక్ష జరగనుంది. ఇటీవల విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరుకుంది. దేశీయ డిమాండ్, ప్రభుత్వ వ్యయం, పెట్టుబడుల పెరుగుదల దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.
జూన్ 21న జరిగిన మరో కీలక సమావేశంలో ప్రధాని మోడీ.. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా తెలియజేయాలని మంత్రులకు సూచించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావాలని, పనితీరు తక్కువగా ఉన్న శాఖలు తమ పనితీరును మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విదేశాంగ మంత్రి ఇటీవల ప్రధాని ఐదు దేశాల పర్యటన ఫలితాలపై మంత్రివర్గానికి వివరించగా.. ఆ పర్యటన విజయవంతంగా ముగిసినందుకు మంత్రివర్గం ప్రధాని మోడీకి అభినందనలు తెలిపింది.
ఎవరు హాజరవుతారు?
మంగళవారం జరిగే ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శులు పీ.కే. మిశ్రా, శక్తికాంత దాస్, కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్, అలాగే కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు హాజరుకానున్నారు. సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రానున్న రోజుల్లో ప్రభుత్వ పాలనా విధానానికి కీలక దిశానిర్దేశంగా మారే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..