PM Modi: సోనియా జీ మీ ఆరోగ్యం ఎలా ఉంది?.. అడిగి తెలుసుకున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయసభలు మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో రెండు సభలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఈ నేపథ్యంలో రెండు సభలు రేపటికి వాయిదా పడ్డాయి. సభ ప్రారంభమయ్యే ముందు కాంగ్రెస్ నేత సోనియా గాంధీని ప్రధాని మోదీ పలుకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మణిపుర్ అంశంపై చర్చించాలని మోదీకి సోనియా విజ్ఞప్తి చేసినట్లు లోక్సభలో ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌధురి వెల్లడించారు. సమావేశాల తొలిరోజు లోక్సభ సభ్యులను ప్రధాని మోదీ కలిసిన సందర్భంగా ఈ సంభాషణ జరిగినట్లు ఆయన చెప్పారు. లోక్సభ సమావేశాల మొదటి రోజు వివిధ పార్టీల సభ్యులు పలకరించుకోవడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో సోనియా గాంధీని ప్రధాని మోడీ పలకరించారు. ఆమె ఆరోగ్యం గురించి మోడీ వాకబు చేశారు.
Also Read: Russia President Putin: పుతిన్ దక్షిణాఫ్రికా పర్యటన రద్దు.. ఎందుకంటే..?
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
- AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
సాంకేతిక లోపం కారణంగా భోపాల్లో ఆమె చార్టర్డ్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయిన కొద్ది రోజుల తరువాత, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పార్లమెంటులో ఆరా తీశారు. తాను బాగానే ఉన్నానని సోనియా గాంధీ ప్రధాని మోదీకి హామీ ఇచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడాన్ని ప్రస్తావించిన మోడీ.. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం తన తల్లి సోనియా గాంధీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలో, 76 ఏళ్ల సోనియా గాంధీ కూర్చొని ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించారు. సాంకేతిక లోపం కారణంగా వారి చార్టర్డ్ విమానం భోపాల్లో అత్యవసర ల్యాండింగ్ చేయబడింది. జులై 17, 18 తేదీల్లో రెండు రోజులపాటు జరిగిన ప్రతిపక్షాల మెగా సమావేశానికి హాజరైన తర్వాత సోనియా గాంధీ బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కరించబడిన తరువాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బుధవారం రాత్రి 9:30 గంటలకు ఇండిగో విమానంలో ఢిల్లీకి తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
తాజావార్తలు
-
Diabetes: షుగర్ కంట్రోల్కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!