Kejriwal: కేజ్రీవాల్ మరో పిటిషన్.. ఈసారి దేనికోసమంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైనా.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. దీంతో ఆయన జైలు నుంచే పరిపాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనకు సంబంధించిన విషయాలు శాసనసభ్యులతో చర్చించేందుకు జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కేజ్రీవాల్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఆయన.. తన ఆరోగ్యం క్షీణించిందని.. తనను పరీక్షించడానికి వర్చువల్గా వ్యక్తిగత డాక్టర్ అభిప్రాయాలు తెలుసుకునేలా అవకాశం కల్పించాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరారు. దీనిపై స్పందించడానికి ఈడీ సమయాన్ని కోరింది. దీంతో విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయస్థానాలు ఎలాంటి తీర్పు ఇస్తాయో చూడాలి. ఇప్పటికే బెయిల్ పిటిషన్లు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో తాజా పిటిషన్లపై ఎలా స్పందిస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: Delhi Crime: దారుణం.. స్క్రూడ్రైవర్తో పొడిచి భార్య, బావమరిదిని హత్య చేసిన భర్త
Also Read
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
ఇక గుజరాత్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఇందులో సీఎం కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Angry Rantman: ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. విషాదంలో నెటిజన్లు
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసింది.
ఇది కూడా చదవండి: MP K.Laxman : కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాంటి దుస్థితి తప్పదు
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!