Kejriwal: కేజ్రీవాల్ మరో పిటిషన్.. ఈసారి దేనికోసమంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైనా.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. దీంతో ఆయన జైలు నుంచే పరిపాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనకు సంబంధించిన విషయాలు శాసనసభ్యులతో చర్చించేందుకు జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కేజ్రీవాల్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఆయన.. తన ఆరోగ్యం క్షీణించిందని.. తనను పరీక్షించడానికి వర్చువల్గా వ్యక్తిగత డాక్టర్ అభిప్రాయాలు తెలుసుకునేలా అవకాశం కల్పించాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరారు. దీనిపై స్పందించడానికి ఈడీ సమయాన్ని కోరింది. దీంతో విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయస్థానాలు ఎలాంటి తీర్పు ఇస్తాయో చూడాలి. ఇప్పటికే బెయిల్ పిటిషన్లు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో తాజా పిటిషన్లపై ఎలా స్పందిస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: Delhi Crime: దారుణం.. స్క్రూడ్రైవర్తో పొడిచి భార్య, బావమరిదిని హత్య చేసిన భర్త
Also Read
- Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
- Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ఇక గుజరాత్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఇందులో సీఎం కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Angry Rantman: ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. విషాదంలో నెటిజన్లు
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసింది.
ఇది కూడా చదవండి: MP K.Laxman : కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాంటి దుస్థితి తప్పదు
తాజావార్తలు
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!