MP K.Laxman : కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాంటి దుస్థితి తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ రామ నవమి సందర్భంగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన శ్రీ సీతా రాములు కళ్యాణ వేడుకల్లో బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా శ్రీ రామ నవమి వేడుకలు జరుగుతున్నాయని, ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం తరువాత మొదటి శ్రీ రామ నవమి కావడం విశేషమన్నారు. ప్రతి గ్రామంలో అందరూ శ్రీ రాముని కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని, దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం శ్రీ సీతా రాముల కళ్యాణం ప్రపంచం మొత్తం వీక్షించడం ఆనవాయితీ అని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించి ఆ ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల కమిషన్ ను సాకుగా చూపెట్టి ఈ కుట్ర కు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ విషయం పై జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళి ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతి తెప్పించానని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి శ్రీ రామ నవమి పండుగ పై ఎందుకు కుట్ర పూరితంగా వ్యవహరించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు లక్ష్మణ్. చివరికి ఆకాశవాణి ద్వరా కూడా వినిపించకుండా ఆంక్షలు విధించారని, ఇది అరిష్టంగా మేము భావిస్తున్నామన్నారు. గత ముఖ్యమంత్రి కూడా ఆనవాయితీ కి విరుద్ధంగా వ్యవహరించాడని, గత నలభై ఏళ్ల ఆచారానికి స్వస్తి పలికి అప్పటి ముఖ్యమంత్రి హాజరు కాలేదన్నారు ఎంపీ లక్ష్మణ్. ఇప్పుడు వారు రాజకీయంగా ఏ రకమైన మూల్యం చెల్లించుకున్నారో చూస్తున్నాని, అలాంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి కూడా వస్తుందన్నారు.
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
కచ్చితంగా ఈ రోజు భద్రాద్రి శ్రీ రాముని కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది అంటే అది కేవలం బిజెపి సాధించిన విజయమే.. నిన్న డిల్లీ లో జాతీయ ఎన్నికల కమిషన్ తో మాట్లాడి అనుమతి తీసుకువచ్చాం కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వీక్షిస్తున్నారు.. అలాగే ముషీరాబాద్ స్ట్రీట్ నంబర్ 4 లో కూడా కులాలకు అందరూ కలిసి జరుపుకున్నారు.. అదే విధంగా ఈరోజు అయోధ్యలో జరిగిన కళ్యాణం విశిష్టత కలిగి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!