Piyush Goyal: AI కంటే మానవ మెదడు ఎప్పటికీ గొప్పదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Piyush Goyal: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ లండన్ లో నిర్వహించిన ఫ్యూచర్ ఫ్రాంటియర్ ఫోరమ్ లో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు (AI), భారత్ తీసుకుంటున్న విధానాలపై ఆయన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఆయన ‘‘మానవ మెదడు ఎప్పటికీ ఏ రకమైన కృత్రిమ మేధస్సుకన్నా గొప్పగానే ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. అలాగే భారత్ తప్పకుండా AIని స్వీకరిస్తుందని, పనితీరు మెరుగుపరిచేందుకు దీన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇది ఉద్యోగాలు కోల్పోతారన్న పరిస్థితిని తీసుకరావడం మాకు ఆందోళనకరం కాదని ఆయన అన్నారు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
మన దేశంలో ఉన్న ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటే.. డేటా రంగం, కొత్త అవకాశాలను డికోడ్ చేయడంలో ప్రపంచానికి భారత్ నుంచి సహాయపడే అవకాశాలు మరెన్నో ఉన్నాయి. అందుకే మన ప్రజలకు తిరిగి శిక్షణనివ్వడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన నేపథ్యంలో AIని స్వీకరించాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. మానవ మెదడే AIని సృష్టించింది. అందుకే దానిని నియంత్రించగలిగేది కూడా మనమే. దీనిపై నాకు పూర్తి నమ్మకం ఉందని గోయల్ పునరుద్ఘాటించారు.
Read Also: Exclusive : తమిళ హీరోలకు తెలుగు దర్శకులు అలా.. తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఇలా
బుధవారం నుండి ప్రారంభమైన రెండు రోజుల యూకే అధికారిక పర్యటనలో భాగంగా పీయూష్ గోయల్ భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. గత వారాల్లో ఇద్దరు దేశాల ప్రధానమంత్రుల ద్వైపాక్షిక ప్రకటన అనంతరం, ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యతకు దారితీసింది. అలాగే గురువారం యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్సచేక్యూర్ రాచెల్ రీవ్స్తో కూడా మంత్రి సమావేశమై, ఆర్థిక వ్యవస్థల సహకారం, సస్టెయినబుల్ ఫైనాన్స్, వాణిజ్య అవకాశాలపై చర్చించారు. మంత్రి పర్యటన భారత-యూకే మధ్య బలమైన ఆర్థిక, వాణిజ్య బంధాలను మరింత దృఢపరచడాన్ని లక్ష్యంగా చేసుకుని కొనసాగుతోంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!