CM Chandrababu: తిరుమల-తిరుపతి, చంద్రగిరి తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం.. శంకుస్థాపన చేసిన సీఎం..
- చంద్రగిరి, తిరుమల-తిరుపతి తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం..
- రూ.126 కోట్లతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్కు కృష్ణా జలాలు..
- నీళ్లు మళ్లింపు పనులకు మూలపల్లి చెరువు వద్ద శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. తిరుమల – తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు.. రూ.126 కోట్ల వ్యయంతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్కు కృష్ణా జలాలను మళ్లించే పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. తిరుపతి సమీపంలోని మూలపల్లి చెరువు వద్ద నీళ్ల మళ్లింపు పనులకు సీఎం శంకుస్థాపన నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరుమల, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు.
Also Read
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
ఇక, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నారావారిపల్లెలో కొనసాగుతున్న పర్యటనలో భాగంగా.. సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా డీఐఎంసీ, ఇండోర్ సబ్స్టేషన్, సీసీ రోడ్లను ప్రారంభించారు. అదేవిధంగా రంగంపేట, బీమావరం నుంచి శ్రీ శేషాచల లింగేశ్వరాలయానికి వెళ్లే బీటీ రోడ్డును సీఎం ప్రారంభించారు. ఈ రోడ్డు ప్రారంభంతో ఆలయానికి వెళ్లే భక్తులకు రాకపోకలు మరింత సులభంగా మారనున్నాయి. అయితే, తిరుమల–తిరుపతి ప్రాంతం దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు వచ్చే ప్రాంతమని, ఇక్కడ తాగునీటి అవసరాలు అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల మౌలిక అవసరాల కల్పనలో భాగంగా ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని చేపడతామని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!