Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. 36కు చేరిన మృతులు
- అసోంను ముంచెత్తిన వరదలు
- 36కు చేరిన మృతులు
- బాధితుల్ని కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్న కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు దెబ్బ తిన్నాయి. ఇళ్లల్లోకి నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు భారీ వరదల కారణంగా సుమారు 4 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Dry Coconut: ఎండు కొబ్బరి తినడం వల్ల ఆ ప్రమాదాల బారి నుంచి బయటపడొచ్చు..
Also Read
- Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
కొపిలీ, బరాక్, కుషియారా వంటి నదులు ప్రమాదకర స్థాయి మించి ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. వరదల వల్ల 19 జిల్లాల్లో నివసిస్తున్న 4 లక్షల మంది పరిస్థితి దయనీయంగా మారినట్లు పేర్కొన్నాయి. ఈ విపత్తు ప్రభావం కరీంగంజ్ జిల్లాలో తీవ్రంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు.. అక్కడ 2.5 లక్షల మందిపై ప్రభావం పడినట్లు చెప్పారు. ఇప్పటివరకూ వరదల్లో, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 36కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Vegetables- Fruits Price: సామాన్యులను బెంబేలెత్తిస్తున్న పండ్లు, కూరగాయల ధరలు..
అసోం వరద బాధితులకు కాంగ్రెస్ అండగా నిలిచింది. వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గే, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. 15 జిల్లాల్లో లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని.. ఇప్పటి వరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారని ఖర్గే పేర్కొన్నారు. అసోం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావంగా నిలుస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నామని ఖర్గే ఎక్స్లో పోస్ట్లో తెలిపారు. రాష్ట్రంలో వరద బాధిత ప్రజలకు సహాయ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని అసోం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కోరారు.
ఇది కూడా చదవండి: Automatic Cars: సరసమైన ధరలో ఇండియాలోని టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!