Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. 36కు చేరిన మృతులు
- అసోంను ముంచెత్తిన వరదలు
- 36కు చేరిన మృతులు
- బాధితుల్ని కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్న కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు దెబ్బ తిన్నాయి. ఇళ్లల్లోకి నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు భారీ వరదల కారణంగా సుమారు 4 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Dry Coconut: ఎండు కొబ్బరి తినడం వల్ల ఆ ప్రమాదాల బారి నుంచి బయటపడొచ్చు..
Also Read
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
కొపిలీ, బరాక్, కుషియారా వంటి నదులు ప్రమాదకర స్థాయి మించి ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. వరదల వల్ల 19 జిల్లాల్లో నివసిస్తున్న 4 లక్షల మంది పరిస్థితి దయనీయంగా మారినట్లు పేర్కొన్నాయి. ఈ విపత్తు ప్రభావం కరీంగంజ్ జిల్లాలో తీవ్రంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు.. అక్కడ 2.5 లక్షల మందిపై ప్రభావం పడినట్లు చెప్పారు. ఇప్పటివరకూ వరదల్లో, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 36కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Vegetables- Fruits Price: సామాన్యులను బెంబేలెత్తిస్తున్న పండ్లు, కూరగాయల ధరలు..
అసోం వరద బాధితులకు కాంగ్రెస్ అండగా నిలిచింది. వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గే, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. 15 జిల్లాల్లో లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని.. ఇప్పటి వరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారని ఖర్గే పేర్కొన్నారు. అసోం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావంగా నిలుస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నామని ఖర్గే ఎక్స్లో పోస్ట్లో తెలిపారు. రాష్ట్రంలో వరద బాధిత ప్రజలకు సహాయ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని అసోం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కోరారు.
ఇది కూడా చదవండి: Automatic Cars: సరసమైన ధరలో ఇండియాలోని టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే..
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!