Sajjala Ramakrishna Reddy: ప్రజలు అధికారం ఇచ్చింది సమస్యలు పరిష్కరించాలని.. ప్రతిపక్షం మీద కేసులు పెట్టడానికి కాదు!
- కక్ష సాధింపును మౌనంగా భరిస్తున్నాం
- జగన్ అభిమాని ఐతే చాలు అరెస్టు చేస్తున్నారు
- మేము కొట్టే దెబ్బ చాలా బలంగా ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్టు చేశారని ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. లేని కేసులు పెట్టడం కూటమి పార్టీ అలవాటుగా చేసుకుందని, వైఎస్ జగన్ పరిపాలనలో ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై కేసులు పెరిగిపోయాయని, ఈ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపును తాము మౌనంగా భరిస్తున్నాం అని తెలిపారు. ప్రజలు అధికారం ఇచ్చింది వారి సమస్యలు పరిష్కరించాలని కానీ.. ప్రతిపక్షం మీద కేసులు పెట్టడానికి, అక్రమ వసూళ్లు చేయడానికి కాదని సజ్జల విమర్శించారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ… ‘దళిత నాయకుడు నందిగం సురేష్ను అక్రమంగా అరెస్టు చేశారు. లేని కేసులు పెట్టడం కూటమి పార్టీ అలవాటుగా చేసుకుంది. వైఎస్ జగన్ పరిపాలనలో ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై కేసులు పెరిగిపోయాయి. ఒక మాజీ ఎంపీకి జైలులో కనీసం సౌకర్యం కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపును మౌనంగా భరిస్తున్నాం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు భార్య, భర్తలను అరెస్టు చేస్తున్నారు. వైఎస్ జగన్ అభిమాని ఐతే చాలు అరెస్టు చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
‘గతంలో నక్సలైట్లను అర్థరాత్రి అరెస్టు చేసేవారు, ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలను అలాగే అరెస్టు చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలో మాకు నేర్పిస్తున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది వారి సమస్యలు పరిష్కరించాలని కానీ.. ప్రతిపక్షం మీద కేసులు పెట్టడానికి, అక్రమ వసూళ్లు చేయడానికి కాదు. గతం కంటే ఇప్పుడు బరితెగింపు ఎక్కువ అయ్యింది. తప్పుడు సాక్షాలు సృష్టించడం, అరెస్టులు చేయడమే కూటమి ప్రభుత్వం అలవాటుగా మార్చుకుంది. దెబ్బ తిన్న వాళ్లకు తెలుసు దెబ్బ ఎలా కొట్టాలో తెలుసు, మేము కొట్టే దెబ్బ చాలా బలంగా ఉంటుంది’ అని సజ్జల వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!