Pemmasani Chandrasekhar: పొన్నూరు నియోజకవర్గంలో పెమ్మసాని రోడ్ షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొన్నూరు నియోజకవర్గంలోని వెజేండ్ల గ్రామంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసారి మాట్లాడుతూ.. తెలంగాణలోని హైదరాబాద్ నగరం ఒక్కప్పుడు రాళ్లు గుట్టలుగా ఉండేది.. కానీ, చంద్రబాబు చేూసిన అభివృద్ది వల్లే.. ఇప్పుడు ఒక ఎకరం భూమి వంద కోట్ల రూపాయలకు అమ్ముడుపోతుందని ఆయన తెలిపారు. అలా హైదరాబాద్ చుట్టు వచ్చిన వేలాది కంపెనీలు లక్షల ఉద్యోగాలు కల్పించి.. లక్షల మంది భవన కార్మికులు బాగుపడుతున్నారు. అలా హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుంది అని పెమ్మసాని పేర్కొన్నారు. అప్పుడు చంద్రబాబు ఆదాయం సృష్టించకపోతే.. ఇప్పుడు హైదరాబాద్ గొప్ప నగరంగా ఉండేది కాదని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
Read Also: Congress: బెంగాల్ అభ్యర్థులు ఖరారు.. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారంటే!
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
మనం 2014-19 మధ్య ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అమరావతిని రాజధానిగా చేసుకుని అక్కడ 33 వేల ఎకరాల భూమిని తీసుకుని దాన్ని కూడా హైదరాబాద్ నగరంలాగా అభివృద్ది చేసేందుకు ప్రయత్నం చేస్తే.. జగన్ వచ్చి మొత్తం నాశనం చేశాడని ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్ష మంది చదువుకుని బయటకు వస్తున్నారు.. వారు ఇప్పుడు ఎక్కడి పోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఇక, ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ లేని మద్యం బ్రాండ్లను తెచ్చారు అని పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు.
Read Also: Zomato: ‘‘ప్యూర్ వెజ్ మోడ్’’ని ప్రారంభించిన జొమాటో.. వారి కోసం ప్రత్యేకం..
వైసీపీ పార్టీలో నాకు సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఇంకా వేరే పేరు వినపడటం లేదు అని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అలాగే, దాదాపు 600 ఎకరాలను ఒక కేజీఎఫ్ సినిమా మాదిరిగా తవ్వి తవ్వి పెట్టారు.. అక్కడి నుంచి వచ్చే దుమ్ముతో రైతుల పంటాలు పూర్తిగా నాశనం అవుతున్నాయన్నారు. ఒక్కసారి అని అవకాశం ఇస్తే.. రాష్ట్రాన్ని పూర్తిగా జగన్ నాశనం చేశారన్నారు. ఇక, 40 సంవత్సరాల నుంచి ధూళిపాళ్ల కుటుంబం మిమ్మల్ని ( ప్రజలను) అంటిపెట్టుకుని ఉంటే.. వాళ్లని కాదని కిలారి రోశయ్యను తెచ్చుకున్నారు.. ఆయన మాత్రం ఇక్కడ ఉన్న వనరులను దోచుకునేందుకు మీరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. ఇక, నాపై పోటీ చేసేందుకు అందరు భయపడిపోతుంటే.. కిలారు రోశయ్యను మాత్రం వైసీపీ పోటీలో నిల్చొబెట్టింది.. ఇక్కడి పిల్లలకు గంజాయిను ఒక ఎమ్మెల్యే అలవాటు చేస్తున్నాడు అని పెమ్మసాని ఆరోపించారు. జగన్ చేసిన ఆరాచకం గురించి చాలా పెద్ద లిస్ట్ ఉందన్నారు. ప్రజలకు తీరని ద్రోహం చేసిన జగన్.. ముస్లింల సంక్షేమం కోసం ఏమైనా చేశారా అని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
తాజావార్తలు
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!