సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించనున్న పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నమ్మకం, కులం, మతంతో సహా అన్ని అంశాలలో సమానత్వం అనే ఆలోచనను ప్రోత్సహించిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీ రామానుజాచార్యుల స్మారకార్థం 216 అడుగుల ఎత్తైన సమానత్వ విగ్రహాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇక ఈరోజు ఉదయం నుంచి సమతా మూర్తి విగ్రహం సందర్శనకు జనాలు పోటెత్తారు. సందర్శకులకు ఫ్రీ ఎంట్రీ లభిస్తోంది. అయితే తాజాగా ఈ విగ్రహాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సందర్శించబోతున్నట్టు సమాచారం.
Read Also : బోయపాటి డిమాండ్… హీరోకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ?
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
- England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్...! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
- Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహ వేడుకలలో భాగంగా హైదరాబాద్లోని సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించే వీవీఐపీలు రానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 6న హైకోర్టు సీజేఐ, ప్రధాన న్యాయమూర్తులు, ఫిబ్రవరి 7న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఫిబ్రవరి 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఫిబ్రవరి 9న మోహన్ భగవత్, ఫిబ్రవరి 10న రాజ్నాథ్ సింగ్ పర్యటనకు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 11న నితిన్ గడ్కరీ, ఫిబ్రవరి 12న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఫిబ్రవరి 13న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. వేడుకలలో ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు పాల్గొంటారు.
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో నిర్మించిన ‘సమతా మూర్తి’ (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) విగ్రహం బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్ అనే ఐదు లోహాల కలయికతో ‘పంచలోహ’ విగ్రహంగా తయారు చేశారు. ప్రపంచంలోనే కూర్చున్న స్థితిలో ఉన్న ఎత్తైన లోహ విగ్రహాలలో ఇది ఒకటి. ఈ విగ్రహాన్ని 54 అడుగుల ఎత్తైన బేస్ బిల్డింగ్పై అమర్చారు. దీనికి ‘భద్ర వేదిక’ అని పేరు పెట్టారు. ఇది వేద డిజిటల్ లైబ్రరీ, పరిశోధనా కేంద్రం, ప్రాచీన భారతీయ గ్రంథాలు, థియేటర్, శ్రీ రామానుజాచార్య అనేక రచనలను వివరించే విద్యా గ్యాలరీ కూడా ఇక్కడ ఉంది. ఈ విగ్రహాన్ని శ్రీ రామానుజాచార్య ఆశ్రమానికి చెందిన శ్రీ చిన్న జీయర్ స్వామి రూపొందించారు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 14వ వరకు శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
-
England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్…! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!