సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించనున్న పవన్ కళ్యాణ్
నమ్మకం, కులం, మతంతో సహా అన్ని అంశాలలో సమానత్వం అనే ఆలోచనను ప్రోత్సహించిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీ రామానుజాచార్యుల స్మారకార్థం 216 అడుగుల ఎత్తైన సమానత్వ విగ్రహాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇక ఈరోజు ఉదయం నుంచి సమతా మూర్తి విగ్రహం సందర్శనకు జనాలు పోటెత్తారు. సందర్శకులకు ఫ్రీ ఎంట్రీ లభిస్తోంది. అయితే తాజాగా ఈ విగ్రహాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సందర్శించబోతున్నట్టు సమాచారం.
Read Also : బోయపాటి డిమాండ్… హీరోకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ?
Also Read
శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహ వేడుకలలో భాగంగా హైదరాబాద్లోని సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించే వీవీఐపీలు రానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 6న హైకోర్టు సీజేఐ, ప్రధాన న్యాయమూర్తులు, ఫిబ్రవరి 7న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఫిబ్రవరి 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఫిబ్రవరి 9న మోహన్ భగవత్, ఫిబ్రవరి 10న రాజ్నాథ్ సింగ్ పర్యటనకు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 11న నితిన్ గడ్కరీ, ఫిబ్రవరి 12న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఫిబ్రవరి 13న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. వేడుకలలో ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు పాల్గొంటారు.
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో నిర్మించిన ‘సమతా మూర్తి’ (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) విగ్రహం బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్ అనే ఐదు లోహాల కలయికతో ‘పంచలోహ’ విగ్రహంగా తయారు చేశారు. ప్రపంచంలోనే కూర్చున్న స్థితిలో ఉన్న ఎత్తైన లోహ విగ్రహాలలో ఇది ఒకటి. ఈ విగ్రహాన్ని 54 అడుగుల ఎత్తైన బేస్ బిల్డింగ్పై అమర్చారు. దీనికి ‘భద్ర వేదిక’ అని పేరు పెట్టారు. ఇది వేద డిజిటల్ లైబ్రరీ, పరిశోధనా కేంద్రం, ప్రాచీన భారతీయ గ్రంథాలు, థియేటర్, శ్రీ రామానుజాచార్య అనేక రచనలను వివరించే విద్యా గ్యాలరీ కూడా ఇక్కడ ఉంది. ఈ విగ్రహాన్ని శ్రీ రామానుజాచార్య ఆశ్రమానికి చెందిన శ్రీ చిన్న జీయర్ స్వామి రూపొందించారు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 14వ వరకు శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!